Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి కల్యాణోత్సవం లడ్డూ రూ.200, వడ ధర రూ.100గా పెంపు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో లభించే లడ్డూ ప్రసాదానికి ఎంతో విశిష్టత వుంది. శ్రీవారి దర్శనానికి వెళ్తే లడ్డూ తీసుకోకుండా భక్తులు కొండ దిగరు. అలాంటి లడ్డూ ధరలు పెరగనున్నాయి. అయితే దర్శనం టికెట్‌

శ్రీవారి కల్యాణోత్సవం లడ్డూ రూ.200, వడ ధర రూ.100గా పెంపు
, శనివారం, 16 డిశెంబరు 2017 (13:47 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో లభించే లడ్డూ ప్రసాదానికి ఎంతో విశిష్టత వుంది. శ్రీవారి దర్శనానికి వెళ్తే లడ్డూ తీసుకోకుండా భక్తులు కొండ దిగరు. అలాంటి లడ్డూ ధరలు పెరగనున్నాయి. అయితే దర్శనం టికెట్‌పై పొందే లడ్డూల ధరలు యధాతథంగా వుంటాయని.. సామాన్య భక్తులకు అందించే లడ్డూ ధరల్లోనూ ఎలాంటి మార్పు వుండదని టీటీడీ తెలిపింది.
 
ఇక సర్వదర్శనం, దివ్యదర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారికి రాయితీ పద్ధతిలో టీటీడీ లడ్డూలను అందజేస్తూ వుంటుంది. రాయితీ లడ్డూలు కాకుండా ఎక్కువ లడ్డూలు కావాలంటే కొంచెం ఎక్కువగా చెల్లించాల్సి వుంటుంది. 
 
కొందరు ఎక్కువ మొత్తంలో లడ్డూలు కొనుగోలు చేయడానికి సిఫార్సు లేఖలు సైతం ఇస్తుంటారు. అలాంటి సిఫార్సు లేఖలపై జారీచేసే లడ్డూల ధరలను పెంచే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కల్యాణోత్సవం లడ్డూ ధర రూ.200, వడ ధర రూ.100గా టీటీడీ రేటును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ధరలు ఈ నెల 25వ తేదీ నుంచి పెరిగే ధరలు అమల్లోకి వస్తాయని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేటి దినఫలాలు : అప్రమత్తంగా మెలగాలి..