అలిపిరి నడకమార్గం సుందరీకరణకు రూ.7.5 కోట్లు

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (21:05 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. కోట్లాది మంది శ్రీవారి భక్తులు నడిచివెళ్లే అలిపిరి నడకమార్గాన్ని మరింతగా సుందరీకరించనుంది. ఇందుకోసం రూ.7.5 కోట్ల నిధులను కేటాయించింది. 
 
అలాగే, కడప జిల్లా రాయచోటిలో కల్యాణమండపం నిర్మాణానికి రూ.2.21 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదం తెలిపారు. ఇకపోతే, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని జమ్మూలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదించారు.
 
తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగుల ఆరోగ్య నిధికి కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు ఆప్ కాస్ తరహాలో కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదించారు. 
 
స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వివిధ నిర్మాణాలకు రూ.4.46 కోట్ల నిధులు కేటాయించారు. వరాహస్వామి విశ్రాంత భవనం-2లో మరమ్మతులకు రూ.2.61 కోట్లు మంజూరు చేశారు. వీటితోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు కూడా తితిదే పాలక మండలి ఆమోదం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సినీ నటి కృషి తపండ నివాసంలో వ్యాపారవేత్త మృతి.. ఏం జరిగింది?

పోలీసులకు.. ఆర్మీకి మధ్య ఘర్షణ.. 40 మంది సైనికులపై కేసు నమోదు.. ఏం జరుగుతోంది?

షాపుల్లో అమ్మే ఊరగాయలను లొట్టలేసుకుని తింటున్నారా?

పెళ్లి మండపానికి తాగి నిలబడిలేని స్థితిలో వచ్చిన వరుడు.. కాదు పొమ్మన్న వధువు

హైదరాబాద్ నగర పోలీసులకు సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

తర్వాతి కథనం
Show comments