Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి నవనీత సేవలో పాల్గొన్నటిటిడి స‌భ్యుడు జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు

శ్రీవారి నవనీత సేవలో పాల్గొన్నటిటిడి స‌భ్యుడు జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు
విజయవాడ , గురువారం, 7 అక్టోబరు 2021 (13:23 IST)
టిటిడి బోర్డు మెంబ‌ర్ల ఎంపిక‌పై రాజ‌కీయ దుమారం చెల‌రేగుతుండ‌గా, స‌భ్యులు ఒక్కొక్క‌రు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాల‌లో వ‌రుస‌గా పాల్గొంటున్నారు. టీటీడీ బోర్డ్ సభ్యులుగా జూపల్లి రామేశ్వరరావు నియామ‌కం అయ్యారు. ఆయ‌న‌తో టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు. రంగనాయక మండపంలో జూప‌ల్లి స‌బ్యుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

అనంత‌రం జూపల్లి రామేశ్వరరావు శ్రీవారి నవనీత సేవలో పాల్గొన్నారు. స్వామివారి గోశాలను సందర్శించి స్వయంగా వెన్నను చిలికారు. టీటీడీ బోర్డు స‌భ్యుడిగా తిరిగి ఎంపిక కావ‌డం త‌న పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌ని జూప‌ల్లి రామేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీవారి సేవ‌కు త‌న జీవితాన్ని అంకితం చేస్తాన‌ని ఆయ‌న భ‌క్తితో నివేదించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగుళూరులో ఐటీ సోదాల కలకలం.. 120కి పైగా కార్లు సీజ్‌!