తితిదే గోశాలలో గోపూజ.. చిన్ని క్రిష్ణుడు చిద్విలాసం

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (22:45 IST)
గోకులాష్టమి సంధర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీ గోశాలలో బుధవారం గోపూజలు నిర్వహించారు. టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తొలుత శ్రీక్రిష్ణస్వామి ఆలయంలో స్వామివారికి నిర్వహించిన పూజలో పాల్గొన్నారు.
 
ఆ తరువాత అర్చకుల ఈఓ సింఘాల్‌కు వరిపట్టం కట్టి సాంప్రదాయబద్ధంగా గోపూజా మందిరానికి తీసుకెళ్ళారు. అలంకరించిన గోవుకు ఈఓ పూలమాలలు వేసి పసుపు, కుంకుమతో అలంకరించి అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య గోపూజ నిర్వహించారు. 
 
ఆ తరువాత గోవులకు దాణా పెట్టారు. కోవిడ్ -19 నేపథ్యంలో చాలా పరిమిత సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో అభిషేకం, అర్చనలు జరిగాయి. తిరుమలలో కూడా శ్రీక్రిష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. 
 
గోగర్భం డ్యాం చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్థనుడు అయిన శ్రీక్రిష్ణునికి ఉదయం 10గంటల నుంచి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, కుంకుమ, చందనం, పంచామృతాభిషేకాలు చేశారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖ ఆర్‌టిఓ వద్ద డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్‌ను ప్రారంభించిన డియాజియో ఇండియా

ఏపీకి అమరావతి రాజధాని ఒక్కటేనా? భవిష్యత్తులో మరోచోటకి వెళ్తామేమో?: మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు

తెలంగాణ ఉద్యమకారులకిచ్చిన హామీలు ఏమయ్యాయి? రేవంత్ సర్కారుకి రాములమ్మ సూటి ప్రశ్న

హర్మూజ్ జలసంధిని తెరవకపోతే సర్వనాశనం చేస్తా: ఇరాన్‌కు ట్రంప్ లేటెస్ట్ వార్నింగ్

వేగంగా వెళ్తున్న డోర్ లేని బస్సు నుంచి కిందపడి వృద్ధురాలు మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

27-03-2026 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య నుంచి బయటపడతారు

శ్రీరామనవమి రోజున ఈ రాశుల వారికి అంతా శుభం

శ్రీరామనవమి రోజున సుందరకాండను చదివితే..?

26-03-2026 గురువారం ఫలితాలు - పొగడ్తలకు పొంగిపోవద్దు

25-03-2026 బుధవారం ఫలితాలు-దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments