Lunar Eclipse: చంద్రగ్రహణం: 12 గంటల పాటు మూతపడనున్న శ్రీవారి ఆలయం

సెల్వి
శనివారం, 6 సెప్టెంబరు 2025 (19:51 IST)
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మూతపడనుంది. చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ (ఆదివారం) శ్రీవారి ఆలయాన్ని దాదాపు 12 గంటల పాటు మూతపడనుంది. ఈ కారణంగా, భక్తులకు దాదాపు 15 గంటల పాటు స్వామివారి దర్శన భాగ్యం ఉండదని స్పష్టం చేసింది.
 
సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3:30 గంటల నుంచి, మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 3:00 గంటల వరకు ఆలయం మూసివేత కొనసాగుతుంది. సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేయడం ఆనవాయితీ. 
 
ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. గ్రహణం ముగిసిన తర్వాత, సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం నుంచి ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి, దర్శనాలను యథావిధిగా పునఃప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
 
ఆలయం మూసివేత సందర్భంగా అన్ని రకాల ఆర్జిత సేవలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సిఫార్సు లేఖలపై జారీచేసే దర్శనాలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ. 6 లక్షలు సుపారీ ఇచ్చి కన్నకొడుకునే హత్య చేయించిన తల్లి, కారణం ఏంటి?

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు : ఎన్.ఐ.ఏ దర్యాప్తు

టీవీకేకు ఉమ్మడి ఎన్నికల చిహ్నాన్ని పొందే ప్రక్రియ ప్రారంభం

ఏపీలో ప్రతి 50 కిమీకి ఒక పోర్టు నిర్మాణం : సీఎం చంద్రబాబు

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో కేవలం 47 శాతం పోలింగ్ మాత్రమే నమోదు

అన్నీ చూడండి

లేటెస్ట్

09-11-2025 నుంచి 15-11-2025 వరకూ మీ రాశి ఫలితాలు

08-11-20 శనివారం ఫలితాలు - మీ కష్టం మరొకరికి లాభిస్తుంది

సంకష్టహర చతుర్థి రోజున సంకష్ట నాశన గణేశ స్తోత్రాన్ని పఠిస్తే..?

Sankatahara Chaturthi: శనివారం సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే శనిదోషాలు పరార్

07-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య పరిష్కారం అవుతుంది..

తర్వాతి కథనం
Show comments