Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెప్టెంబరు 7న రక్త చంద్రగ్రహణం.. ఏయే దేశాల్లో కనిపిస్తుంది...

Advertiesment
blood moon

ఠాగూర్

, శుక్రవారం, 29 ఆగస్టు 2025 (16:40 IST)
ఖగోళ అద్భుతాల కోసం ఎదురు చూసేవారికి ఇది ఒక శుభవార్త. వచ్చే నెలలో అకాశంలో ఒక అరుదైన, కనువిందు చేసే దృశ్యం ఆవిష్కృతం కానుంది. సెప్టెంబరు 7-8  తేదీల రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు సాధారణం కంటే భిన్నంగా ఎర్రటి నారింజ రంగులో ప్రకాశిస్తూ కనిపిస్తాడు. అందుకే దీనిని బ్లడ్ మూన్‌ లేదా రక్త చంద్రగ్రహణం అని పిలుస్తారు. ఈ అద్భుత చంద్రగ్రహణం 82 నిమిషాల పాటు వీక్షించే అవకాశం ఉంది. 
 
ఈ గ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో స్పష్టంగా కనిపించనుంది. భారత్‌లోని ప్రజలు కూడా ఈ ఖగోళ వింతను చూసే అవకాశం ఉంది. వాతావరణం అనుకూలించి, ఆకాశం నిర్మలంగా ఉంటే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పూణె, లక్నో, చంఢీగఢ్ వంటి ప్రధాన నగరాల్లో ఈ రక్త చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. ఇటీవలికాలంలో ఇంత ఎక్కువసేపు, ఇంత విస్తృతంగా కనిపించే చంద్రగ్రహం ఇదే కావడం గమనార్హం. 
 
అసలు బ్లడ్ మూన్ ఎందుకు ఎర్రగా కనిపిస్తుందనే సందేహాం చాలా మందికి కలుగుతుంది. సూర్యుడికి, చంద్రుడికి మధ్యగా భూమి వచ్చినపుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పూర్తిగా పడుతుంది. అయితే, సూర్యుని కాంతి భూమి వాతావరణం గుండా చెదిరిపోతుంది. కేవలం ఎరువు, నారింజ రంగుల కాంతి కిరణాలు మాత్రమే చంద్రుడినే చేరతాయి. దీనివల్ల చంద్రుడు ప్రకాశవంతమైన ఎరువు రంగులో దర్శనమిస్తాడు. ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు ఖగోళ ప్రియుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Pulivendula: జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు.. పులివెందులతో సీన్ మారుతోందిగా!