Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త, కౌంటర్ల ద్వారా సర్వదర్సనం టోకెన్లు, ఎప్పటి నుంచో తెలుసా..!

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (21:23 IST)
కోవిడ్ తగ్గుముఖం పట్టిన వెంటనే సర్వదర్సనం టోకెన్లను మంజూరు చేస్తామన్నారు టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డి. ఫిబ్రవరి 15వ తేదీ తరువాత కౌంటర్ల ద్వారా సర్వదర్సనం టోకెన్లను అందించాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. కోవిడ్ కేసులు తగ్గితే మార్చితే 1వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత సేవల పునరుద్దరణ, పలు సేవలకు భక్తులను అనుమతిస్తామన్నారు.

 
స్వామివారి దర్సనం టిక్కెట్లు విక్రయించే నకిలీ వెబ్ సైట్లను గుర్తించే పనిలో ఉన్నామన్నారు. నకిలీ వెబ్ సైట్ నిర్వాహకులను వదిలిపెట్టమన్నారు. టిటిడికి సంబందించిన అధికారిక వెబ్ సైట్ లోనే దయచేసి భక్తులు టోకెన్లను పొందవచ్చునన్నారు.

 
త్వరలో శ్రీవారి నడక మార్గం పునరుద్ధణ పనులకు సంబంధించిన టెండర్లను ఖరారు చేస్తామన్నారు. శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు అందుబాటులోకి వచ్చేందుకు మూడు నెలలకు పైగా సమయం పడుతుందన్నారు. 

 
బండరాళ్ళు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలను ముందస్తుగా గుర్తించే విధంగా సాంకేతికను తీసుకొస్తున్నామన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ఈ నెల 16వ తేదీన అంజనాద్రి అభివృద్థి పనులకు భూమి పూజ చేస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

శ్రేయాస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్న ఎడిన్ రోజ్!

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

03-06-2025 మంగళవారం దినఫలితాలు - ధనం అందుతుంది.. ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments