Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు తితిదే శుభవారం - రాకపోకలకు 2వ ఘాట్ రోడ్డు

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (15:43 IST)
శ్రీవారి భక్తుల తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుభవార్త చెప్పింది. గత యేడాది ఆఖరులో చిత్తూరు జిల్లాలో విస్తారంగా కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల రెండో కనుమ రహదారి తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెల్సిందే. దీంతో ఈ రెండో ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 
 
అయితే, ప్రస్తుతం మార్గంలో వాహనరాకపోకలకు తితిదే అనుమతి ఇచ్చింది. పూర్తి స్థాయిలో వాహన రాకపోకలకు తితిదే ఈవో ధర్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. దీనిపై శ్రీవారి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 
గత యేడాది కురిసిన భారీ వర్షాల కారణంగా డిసెంబరు 1వ తేదీన 16 కిలోమీటరు వద్ద కొండ చరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. డిసెంబు 4వ తేదీ వరకు మొదటి ఘాట్ రోడ్డులోనే రెండు వైపులా రాకపోకలను అనుమతిస్తూ వచ్చారు. 
 
అయితే, డిసెంబరు 5వ తేదీ నుంచి రెండో ఘాట్ రోడ్డులో వాహనాలను లింకు రోడ్డు మీదుగా మళ్లించారు. లింక్ రోడ్డు మీదుగా వాహనాలు మళ్లించడంతో ప్రయాణ సమయం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దెబ్బతిన్న మార్గంలో 80 శాతం మేరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తికావడంతో వాహనాలను అనుమచింతారు. సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో వాహనాలను అనుమతిస్తామని తితిదే అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

14-09-2024 శనివారం దినఫలితాలు : అభిమానించే వ్యక్తులే మిమ్ములను మోసగిస్తారు....

బుధాదిత్య యోగం.. కన్యారాశిలోకి సూర్యుడు.. ఈ ఐదు రాశులకు లాభం

13-09-2024 శుక్రవారం దినఫలితాలు : మానసికంగా కుదుటపడతారు...

12-09-2024 గురువారం దినఫలితాలు - సకాలంలో పనులు పూర్తి చేస్తారు....

గురువారం పసుపు రంగు దుస్తులు... సాయిబాబాకు పాల పదార్థాలు?

తర్వాతి కథనం
Show comments