తితిదే దర్శనానికి కొత్త నిబంధనలు...

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (15:40 IST)
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ ఉన్నట్లు సర్టిఫికెట్ తేవాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కొవిడ్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
 
కాగా ఈ నెల 25న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు ఎనిమిది వేల చొప్పున సర్వ దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. 
 
26 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. అక్టోబరు మాసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కెట్లోకి వచ్చిన డేంజరస్ మ్యాంగోస్, గోషా మహల్‌లో కల్తీ మామిడిపళ్లు

నిమ్మ ధరలకు రెక్కలొచ్చాయి.. రూ.10వేలతో ఆల్ టైమ్ రికార్డ్

నాసిక్‌లో ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి

ఎన్నికలకు దూరమైన అన్నామలై.. బీజేపీకి గట్టిదెబ్బ..

MAVIGUN: అమరావతి సుదూర, అధిక నష్టభయం ఉన్న గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-04-2026 బుధవారం ఫలితాలు - ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు

01-04-2026 నుంచి 30-04- 2026 వరకు మాస ఫలితాలు- సత్కాలం సమీపిస్తుంది..

31-03-2026 మంగళవారం ఫలితాలు - తప్పులు దొర్లే ఆస్కారం ఉంది..

30-03-2026 సోమవారం ఫలితాలు - మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది...

29-03-2026 ఆదివారం ఫలితాలు- రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు..

తర్వాతి కథనం
Show comments