Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ సర్కారుకు హైకోర్టు షాక్ : ప్రత్యేక ఆహ్వానితుల జీవో సస్పెండ్

జగన్ సర్కారుకు హైకోర్టు షాక్ : ప్రత్యేక ఆహ్వానితుల జీవో సస్పెండ్
, బుధవారం, 22 సెప్టెంబరు 2021 (12:49 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు మరోమారు తేరుకోలోని షాకిచ్చింది. తితిదేకు ఇటీవల జంబో బోర్డును ఏర్పాటు చేసింది. వీరిలో పదుల సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. తమకు కావాల్సిన వారికి ప్రత్యేక పేరుతో తితిదే బోర్డులోకి తీసుకున్నారు. ఈ పాలక మండలిని నియామకానికి సంబంధించి బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 
 
నిబంధనలకు విరుద్దంగా టీటీడీ బోర్డు సభ్యుల్ని నియమించారని, దీని వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని, టీటీడీ స్వతంత్రతను దెబ్బ తీసేలా జీవోలు ఉన్నాయని కోర్టులో పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు సస్పెండ్  చేసింది. పాలకమండలి నియామకంపైనా హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని విచారణను వాయిదా వేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

CBSE కీలక నిర్ణయం: తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు..?