Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ మాట.. ఆడపడుచులు క్షోభిస్తున్నారు.. మేలు చేయడం లేదు.. కీడు చేస్తున్నారు...

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ వార్షిక వేడుకల్లో భాగంగా సోమవారం లష్కర్ బోనాల్లో అత్యంత కీలకమైన 'రంగం' కార్యక్రమం నిర్వహించారు. బోనాల పండుగ తర్వాతి రోజు జరిగే ఈ ఘట్టంలో స్వర్ణలత అమ్మవారు భ

అమ్మ మాట.. ఆడపడుచులు క్షోభిస్తున్నారు.. మేలు చేయడం లేదు.. కీడు చేస్తున్నారు...
Webdunia
సోమవారం, 30 జులై 2018 (12:07 IST)
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ వార్షిక వేడుకల్లో భాగంగా సోమవారం లష్కర్ బోనాల్లో అత్యంత కీలకమైన 'రంగం' కార్యక్రమం నిర్వహించారు. బోనాల పండుగ తర్వాతి రోజు జరిగే ఈ ఘట్టంలో స్వర్ణలత అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. లష్కర్ బోనాల సందర్భంగా పచ్చి కుండపై నిలబడి, అమ్మవారిని ఆవహించుకుని స్వర్ణలత భవిష్యత్తును చెప్పారు. ఈ యేడాది బంగారు బోనం కొంత సంతోషం, కొంత దుఃఖం కలిగించిందన్నారు.
 
ముఖ్యంగా 'ఈ యేడాది భక్తుల్లో సంతోషం కనపడలేదు. ఆడపడుచులు క్షోభిస్తున్నారు. ప్రజలకు మేలు చేస్తున్నామనుకుంటున్నారుగానీ కీడు చేస్తున్నారు' అని వెల్లడించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని, తాను న్యాయం వైపు ఉండి దుష్టులను శిక్షిస్తానని భరోసా ఇచ్చారు. ప్రజలంతా తన బిడ్డలేన్న 'మాతంగి'.. ఈ ఏడాది కోరినన్ని వర్షాలుంటాయని, పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు. 
 
ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటానని పేర్కొన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నారు. ప్రతి ఏటా తన వద్దకు భక్తులు సంతోషంగా వస్తున్నారని స్వర్ణలత భవిష్యవాణి చెప్పారని. ఉజ్జయిని మహంకాళి బోనాల ఏర్పాట్లు ఘనంగా చేసినందుకు ప్రభుత్వాన్ని స్వర్ణలత అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

వైకాపా నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత జేసీ

పొరుగు గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులతో ప్రేమ... ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!

నరకం చూపిస్తా నాయాలా? టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను : దువ్వాడ శ్రీనివాస్ చిందులు

అన్నీ చూడండి

లేటెస్ట్

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

తర్వాతి కథనం
Show comments