తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకో తెలుసా?

Webdunia
ఆదివారం, 10 నవంబరు 2019 (11:59 IST)
కలియుగదైవం కొలువైవున్న తిరుమలలో శ్రీవారి పుష్కరిణి పూర్తిగా మూసివేశారు. పుష్కరిణికి అన్ని వైపులా ఉన్న గేట్లకు అధికారులు తాళాలు వేశారు. దీంతో తిరుమలకు వచ్చే భక్తులు పుష్కరిణిలో స్నానాలు చేసేందుకు వీలులేదు. 
 
ప్రతి యేటా వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు ఆగస్టులో పుష్కరిణిని మూసివేసి కోనేరులోని నీటిని మార్చడం ఆనవాయితీ. అయితే, ఈ యేడాది నీటి ఎద్దడి కారణంగా పుష్కరిణి శుభ్రత పనులను వాయిదా వేశారు. తాజాగా, ఈ ప్రక్రియను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు ప్రారంభించారు. 
 
నిల్వ ఉన్న మురుగునీటిని పైపుల ద్వారా నీటిశుద్ధి కేంద్రాలకు తరలించారు. నెల రోజులపాటు పుష్కరిణి శుద్ధి పనులు కొనసాగనున్నాయి. పుష్కరిణి అడుగుభాగం, మెట్లను పూర్తిగా శుభ్రం చేస్తారు. పాచి, చెత్తాచెదారాన్ని తొలగించి రంగులు వేస్తారు. అనంతరం 23 లక్షల గ్యాలెన్ల నీటితో పుష్కరిణిని నింపుతారు. 
 
ఈ పనులన్నీ పూర్తయిన అనంతరం వచ్చే నెల 6న పుష్కరిణిని పునఃప్రారంభిస్తారు. ఈ పనుల కారణంగా సాయంత్రం ఊరేగింపు సమయంలో ఉత్సవర్లకు సమర్పించే పుష్కరిణి హారతిని కూడా రద్దు చేశారు. పుష్కరిణి మరమ్మతులు పూర్తయ్యే వరకు భక్తులు స్నానపు గదుల్లోనే స్నానమాచరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోర్ముజ్ జలసంధి మూసివేత.. దేశంలో పెట్రో ధరలు భగ్గు?

ఖమేనీ మృతిపై ప్రియాంకా మండిపాటు - కన్నుకు కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని గుడ్డిది చేస్తుంది...

అశ్లీల వీడియోపై తితిదే చైర్మన్ వివరణ.. సన్నాసులకు ఎడిటింగ్ కూడా సరిగ్గా రాదు (వీడియో)

చరిత్రలో అత్యంత క్రూరుడైన ఖమేనీ మరణించాడు.. ట్రంప్ ప్రకటన

ఆ వీడియోలో వున్నది నేను కాదు, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసా: తితిదే చైర్మన్ బి.ఆర్ నాయుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

28-02-2026 - శనివారం ఫలితాలు- మీ తప్పులు సరిదిద్దుకోవడం ఉత్తమం

27-02- 2026 శుక్రవారం ఫలితాలు : దూర ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు...

26-02-2026 గురువారం ఫలితాలు - కొత్త సమస్యలు తలెత్తకుండా...?

Hanuman Chalisa.. హనుమాన్ చాలీసాను రోజూ పఠిస్తే.. ఏంటి ఫలితం?

Amalaki Ekadashi 2026: అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే..?

తర్వాతి కథనం
Show comments