Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులారా..ఈ యేడాది పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఏకాంతమే..?

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (21:56 IST)
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 30 నుంచి డిసెంబ‌రు 8వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం తెలిపారు.

తిరుచానూరులోని ఆస్థాన మండ‌పంలో మంగ‌ళ‌వారం జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ‌బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు.  కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌త దృష్ఠ్యా అమ్మ‌వారి వాహ‌న సేవ‌లు, పంచ‌మి తీర్థం ఆల‌య వాహ‌న మండ‌పంలో ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ కోవిడ్ -19ను దృష్టిలో ఉంచుకుని అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు ఆగ‌మ శాస్త్రం, సంప్ర‌దాయ బ‌ద్ధంగా ఏకాంతంగా నిర్వ‌హించేందుకు అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌న్నారు. ఉద్యాన‌, విద్యుత్ విభాగాల అధికారులు ఆల‌యం అలంక‌ర‌ణ‌లో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవాల‌ని ఆదేశించారు. ఆరోగ్య సిబ్బంది పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వాహ‌న‌సేవ‌ల‌ను ఎస్వీబిసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌‌న్నారు.

అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో స్న‌ప‌స తిరుమంజ‌నం నిర్వ‌హించే రోజుల్లో ఆక‌ర్ష‌ణీయ‌మైన మాల‌లు, పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌ని ఉద్యానవ‌న విభాగం అధికారుల‌ను ఆదేశించారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా విచ్చేసే భ‌క్తులంద‌రికి మూల‌మూర్తి ద‌ర్శ‌నం క‌ల్పించాల‌న్నారు. అన్న‌ప్ర‌సాదం విభాగం ఆధ్వ‌ర్యంలో డెప్యూటేష‌న్ సిబ్బందికి అన్న‌ప్ర‌సాదాలు అందిచాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.  

బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా న‌వంబరు 29వ తేదీ ఉద‌యం ల‌క్ష‌కుంకుమార్చ‌న, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తార‌న్నారు. న‌వంబ‌రు 30న ఉద‌యం ధ్వజారోహణం, డిసెంబ‌రు 4న రాత్రి గ‌జ‌వాహ‌నం, డిసెంబ‌రు 8న పంచ‌మితీర్థం, డిసెంబ‌రు 9న పుష్ప‌యాగం నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

తర్వాతి కథనం
Show comments