Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన తితిదే

Advertiesment
Good News
, ఆదివారం, 14 నవంబరు 2021 (14:29 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు శుభవార్త చెప్పింది. త్వరలో తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోనున్నట్లు తితిదే ఛైర్మన్ వైపీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతిస్తుండగా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో అందుకు అనుగుణంగా భక్తుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 
 
కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నడకదారి భక్తులు ఇబ్బంది పడ్డారని… వర్షాలు తగ్గడంతో నడకదారిలో అడ్డంకులన్నీ తొలగిపోయాయని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అధికారులతో చర్చించి భక్తుల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌ లోనా.. లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఇవ్వాలా అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 
 
కాగా ప్రస్తుతం టీటీడీ దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో మాత్రమే విడుదల చేస్తోంది. శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను ‘గోవింద’ యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14-11-2021 ఆదివారం దినఫలాలు - ఆదిత్య హృదయం చదివిన లేక వినిన శుభం