Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి రోజున శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు.. ఏంటది?

దీపావళి రోజున శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు.. ఏంటది?
, గురువారం, 4 నవంబరు 2021 (17:46 IST)
దీపావళి పండుగ పూట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ఏపీలోని పర్యాటకులకు ఇది ఎంతో మంచి శుభవార్త. రాష్ట్రంలో ఉన్న నదుల్లో బోటు షికారుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీచేసింది.
 
ఈ నెల ఏడో తేదీ నుంచి పాపికొండలు, భవానీద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో బోట్లు నడపనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) డైరెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో మూతబడిన పర్యాటకం తిరిగి తెరుచుకుంటున్నాయి. 
 
బోట్లపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం 9 చోట్ల ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లు సమర్థంగా పనిచేసేలా రెవెన్యూ, పోలీస్, విపత్తుశాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే, హోటళ్లు, రిసార్టులు, ఇతర సందర్శనీయ ప్రాంతాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని కూడా సత్యనారాయణ ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌ను అలా ఉపయోగించేస్తున్నారు