Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం, ఎందుకంటే?

పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం  ఎందుకంటే?
Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (21:18 IST)
తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు.
 
అనంతరం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటిలో శుద్ధి చేశారు. అలాగే నామకోపు, శ్రీ చూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
 
ప్రతియేడాది నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది టిటిడి. అంతేకాదు పద్మావతి ఆలయంలో ఆగష్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు మూడురోజుల పాటు పవిత్రోత్సవాలను కూడా నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

లేటెస్ట్

24-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

23-03-2025 ఆదివారం మీ రాశిఫలాలు : ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

23-03-2025 నుంచి 29-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

కాలాష్టమి రోజు కాలభైరవ పూజ.. రాహు, కేతు దోషాల నుంచి విముక్తి

22-03-2025 శనివారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

తర్వాతి కథనం