Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏడుకొండలవాడా గోవిందా గోవిందా, బ్రహ్మోత్సవాలు ఆ తేదీల్లోనే...

ఏడుకొండలవాడా గోవిందా గోవిందా, బ్రహ్మోత్సవాలు ఆ తేదీల్లోనే...
, సోమవారం, 17 ఆగస్టు 2020 (19:37 IST)
కలియుగ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తేదీని ఖరారు చేశారు. బ్రహ్మోత్సవాలు ఏవిధంగా నిర్వహిస్తారు.. అసలు గత సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా అదే తేదీల్లో జరుగుతుందా లేదా అన్న అనుమానం కోట్లాదిమంది భక్తుల్లో ఉండేది.
 
అయితే వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది టిటిడి. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీన అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు.
 
బ్రహ్మోత్సవాల్లో విశేషమైన రోజుల వివరాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబర్ 19వ తేదీన ధ్వజారోహణం, సెప్టెంబర్ 23వ తేదీన గరుడసేవ, సెప్టెంబర్ 24వ తేదీన స్వర్ణరథోత్సవం, సెప్టెంబర్ 26వ తేదీన రథోత్సవం, సెప్టెంబర్ 27వ తేదీన చక్రస్నానం, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగనున్నాయి.
 
అయితే బ్రహ్మోత్సవాలను ఎలా నిర్వహించాలి అనే విషయంపై టిటిడి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలా.. లేక పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించి నిర్వహించాలా అన్న ఆలోచనలో టిటిడి ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ నెల చివరకి టిటిడికి సంబంధించిన పాలకమండలి సమావేశంలో టిటిడి అధికారులు ఇందుకు సంబంధించిన అధికారులు ఒక నిర్ణయం తీసేసుకోనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెరుచుకున్న అయ్యప్ప ఆలయం తలుపులు.. నేటి నుంచి మాస పూజలు