Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుసగా మూడు రోజుల సెలవులు.. తిరుమలకు పోటెత్తిన భక్తులు

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (13:48 IST)
కలియుగ వైకుంఠం తిరుమల కొండపై ఒక్కసారిగా భక్తుల రద్దీ అమాంతం పెరిగిపోయింది. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు. ఇప్పటికే సర్వదర్శనం టోకెన్లు లేకుండా భక్తులు కొండపైకి చేరుకున్నారు. సర్వదర్శనానికి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులతో వైకుంఠ కాంప్లెక్స్‌-2లో కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లలో పూర్తిగా నిండిపోయాయి. దీంతో క్యూలైన్ గోగర్భం జలాశయం వరకు చేరుకుంది. 
 
ప్రస్తుతం తిరుమల కొండపై ఉన్న రద్దీ దృష్ట్యా శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాలు వెల్లడించాయి. సాయంత్రంలోపు భక్తుల రద్దీ తగ్గకపోతే క్యూలైన్లో ప్రవేశాన్ని రద్దు చేసి శనివారం ఉదయం నుంచి అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
రద్దీ పరిస్థితిని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలను శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. సాయంత్రంలోపు భక్తుల రద్దీ తగ్గకపోతే క్యూలైన్లో ప్రవేశాన్ని రద్దు చేసి శనివారం ఉదయం నుంచి అనుమతించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో ప్రీమియర్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్, డిజైన్ డెమోక్రసీ 2025

Nara Lokesh: ప్రధాని మోదీతో 45 నిమిషాల పాటు భేటీ అయిన నారా లోకేష్

Mumbai On High Alert: ముంబైలో 400 కిలోల ఆర్డీఎక్స్‌, వాహనాల్లో వాటిని అమర్చాం.. హై అలెర్ట్

రెండేళ్ల పాపాయిని ఎత్తుకెళ్లిన కోతుల గుంపు.. నీళ్ల డ్రమ్ములో పడేసింది.. ఆపై ఏం జరిగిందంటే?

భర్త సమోసా తీసుకురాలేదని భార్య గొడవ.. పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లింది..

అన్నీ చూడండి

లేటెస్ట్

Pitru Paksha: ఆ మూడు రుణాల్లో పితృరుణం తీర్చుకోవాల్సిందే.. మహాలయ పక్షం ప్రారంభం ఎప్పుడు?

Anant Chaturdashi 2025: అనంత చతుర్దశి వ్రతానికి... గణేష నిమజ్జనానికి సంబంధం ఏంటంటే?

Ganesh Nimmajanam: గణేష్ నిమ్మజ్జనం సమయంలో ఈ తప్పులు చేయవద్దు

మరింత మెరుగైన శ్రీవారి సేవల కోసం ట్రైనీ వాలంటీర్లు : తితిదే నిర్ణయం

04-09-2025 గురువారం ఫలితాలు - మీ శ్రీమతితో సౌమ్యంగా మెలగండి...

తర్వాతి కథనం
Show comments