Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై వెనక్కి తగ్గిన తితిదే

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (16:58 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి మరోమారు వెనక్కి తగ్గింది. ఇటీవల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. 
 
ఈ టిక్కెట్ల పెంపుపై తితిదే పాలక మండలి సభ్యుల మధ్య జరిగిన చర్చకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ చర్చ చేపల మార్కెట్‌లో బేరం చేసినట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై తితిదే తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది. 
 
శ్రీవారి ఆలయంలో కరోనా కారణంగా గత రెండేళ్ళుగా భక్తులను అర్జిత సేవలకు అనుమతించడం లేదు. దర్శనానికి కూడా పరిమిత సంఖ్యలోనే అవకాశం కల్పిస్తున్నారు. గత పాలక మండలి సమావేశంలో టేబుల్ అజెండాగా అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై చర్చ చేపట్టారు. 
 
సామాన్య భక్తులకు ధరలు పెంచబోమంటూనే సిఫారసు లేఖలపై కేటాయించే అర్జిత సేవా టిక్కెట్ల ధరలను పదింతలు పెంచుతూ ప్రతిపాదన చేశారు. దీనిపై భక్తులు మండిపడ్డారు. అర్జిత సేవా టిక్కెట్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీధి కుక్క చేతిలో చిరుత పులి ఘోర పరాజయం, 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది (video)

Heavy Rains Lash Chennai: చెన్నైని కుమ్మేసిన భారీ వర్షాలు.. కరెంట్ తీగను తొక్కి కార్మికురాలు మృతి

Dharmasthala Case: శానిటరీ వర్కర్ చెప్పినవన్నీ అబద్ధాలే.. అరెస్ట్ అయ్యాడు

Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ అపూర్వమైన ఘనత.. ప్రపంచ రికార్డు

Senior citizen: వృద్ధుడిని చంపిన కేర్ టేకర్.. 8 గ్రాముల బంగారును ఎత్తుకెళ్లాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Goddess Lakshmi: పగటి పూజ నిద్రపోయే వారింట లక్ష్మీదేవి వుండదట

22-08-2025 శుక్రవారం ఫలితాలు - పుణ్యకార్యంలో పాల్గొంటారు...

Ganesha Idol: అనకాపల్లిలో 126 అడుగుల లక్ష్మీ గణపతి ఏర్పాటు

21-08-2025 రాశి ఫలితాలు.. ఈ రాశికి ఈ రోజు నిరాశాజనకం

121 kg gold: 121 కేజీల బంగారాన్ని శ్రీవారికి కానుకగా ఇచ్చిన అజ్ఞాత భక్తుడు

తర్వాతి కథనం
Show comments