Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై వెనక్కి తగ్గిన తితిదే

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (16:58 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి మరోమారు వెనక్కి తగ్గింది. ఇటీవల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. 
 
ఈ టిక్కెట్ల పెంపుపై తితిదే పాలక మండలి సభ్యుల మధ్య జరిగిన చర్చకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ చర్చ చేపల మార్కెట్‌లో బేరం చేసినట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై తితిదే తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది. 
 
శ్రీవారి ఆలయంలో కరోనా కారణంగా గత రెండేళ్ళుగా భక్తులను అర్జిత సేవలకు అనుమతించడం లేదు. దర్శనానికి కూడా పరిమిత సంఖ్యలోనే అవకాశం కల్పిస్తున్నారు. గత పాలక మండలి సమావేశంలో టేబుల్ అజెండాగా అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై చర్చ చేపట్టారు. 
 
సామాన్య భక్తులకు ధరలు పెంచబోమంటూనే సిఫారసు లేఖలపై కేటాయించే అర్జిత సేవా టిక్కెట్ల ధరలను పదింతలు పెంచుతూ ప్రతిపాదన చేశారు. దీనిపై భక్తులు మండిపడ్డారు. అర్జిత సేవా టిక్కెట్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శలు చేశారు. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

తర్వాతి కథనం
Show comments