Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వారు శబరిమలకు రావొద్దు : కేరళ సర్కారు ఆదేశాలు

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (10:31 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మన దేశంలో తొలిసారి వెలుగు చూసింది కేరళ రాష్ట్రంలోనే. ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రస్తుతం ఈ వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. ఫలితంగా ప్రతి రోజూ సుమారుగా 40 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 
 
ఈ క్రమంలో కోవిడ్ బారినపడి కోలుకున్న వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఇలాంటి వారికి కేరళ సర్కారు కొత్త ఆంక్షలు విధించింది. కొవిడ్‌-19 వైరస్ సోకి తిరిగి కోలుకున్న వారు శబరిమలకు రావొద్దని కేరళ సర్కారు విజ్ఞప్తి చేస్తోంది. 
 
కోలుకున్న వారిలో మూడు వారాల నుంచి మూడు నెలల దాకా వైరస్‌ ప్రభావం ఉంటుందని, శ్వాస ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని చెబుతోంది. అలాంటి వారు శబరి కొండను ఎక్కేప్పుడు ఆక్సిజన్‌ తగ్గడం వల్ల ఇబ్బంది పడే ప్రమాదముందని హెచ్చరిస్తోంది. పల్మనాలజిస్టుల మార్గదర్శనంలో శారీరక వ్యాయామం చేసి, శ్వాస సమస్యలు లేవని నిర్ధారణ అయితే.. జాగ్రత్తలు తీసుకుంటూ శబరికి రావొచ్చని పేర్కొంది.
 
కాగా, ఈ నెల 16వ తేదీ నుంచి మండల పూజ సీజన్‌ ప్రారంభంకావడం.. డిసెంబరు చివరి నుంచి మకరవిలక్కు దర్శనాలకు అనుమతించడంతో.. శబరిమల యాత్రికుల కోసం సోమవారం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో ప్రధానంగా భక్తులు మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటించడం వంటి నియమాలను తూ.చ. తప్పకుండా పాటించాలని సూచించింది. దర్శనానికి 24 గంటల ముందు నెగటివ్‌ రిపోర్టు ఉండాలని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనీ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే సెలెబ్రిటీలకు రెండేళ్ల జైలు ఖాయం

ఇదేదో పేర్ని నాని చెప్పినట్లు కనబడుతోందే (video)

DK Aruna: తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా: డీకే అరుణ

Hyderabad: ఈ-ఆటో పార్కింగ్ పొరపాటు.. ఎనిమిదేళ్ల బాలుడు మృతి.. ఎలా?

ఆటోలో డిప్యూటీ సీఎం పవన్: మీతో ఇలా పక్కన కూర్చుని ప్రయాణం అస్సలు ఊహించలేదు సార్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కరుగుతున్న లోహంతో దాహం తీర్చుకున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

Vijayadashami: దశమి పూజ ఎప్పుడు చేయాలి.. ఆయుధ పూజకు విజయ ముహూర్తం ఎప్పుడు?

01-10-2025 బుధవారం ఫలితాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

మహిషాసుర మర్దిని: చెడుపై మంచి సాధించిన విజయం

148 ఏళ్ల నాటి కన్యకా పరమేశ్వరి కోటి కుంకుమార్చన.. రూ.5కోట్ల బంగారం, కరెన్సీతో అలంకారం

తర్వాతి కథనం
Show comments