Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహారాష్ట్రలో 45వేలకు చేరిన కరోనా మృతుల సంఖ్య.. దేశంలోనూ..?

మహారాష్ట్రలో 45వేలకు చేరిన కరోనా మృతుల సంఖ్య.. దేశంలోనూ..?
, శనివారం, 7 నవంబరు 2020 (21:14 IST)
మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య 45వేలు దాటింది. వైరస్‌ వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 3,959 పాజిటివ్‌ కేసులు, 150 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,14,273కు, మరణాల సంఖ్య 45,115కు పెరిగింది.
 
మరోవైపు గత 24 గంటల్లో 6,748 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 15,69,090కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 99,151 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతుంది.
 
దేశంలో కరోనా కేసులతో పాటు, మృతుల సంఖ్య కూడా గణనీయంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 577 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో 1,25,562 మంది మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో 50,357 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 84,62,081కు చేరింది. గడిచిన 24 గంటల్లో 53,920 కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు 78,19,887 కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాణసంచా కాల్చడంపై వెనక్కి తగ్గిన యడ్డ్యూరప్ప సర్కార్