Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారి దర్శనం చాలా సుళువు, ఎలా?

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (20:23 IST)
సాధారణంగా తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలంటే ఎంతో అంగరంగవైభవంగా నిర్వహిస్తుంటారు. లక్షలాదిమంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. స్వామివారి వాహన సేవలను తిలకించేందుకు పెద్దఎత్తున వస్తుంటారు. భక్తుల తాకిడిని బ్రహ్మోత్సవాల సమయంలో అస్సలు తట్టుకోలేరు టిటిడి అధికారులు.
 
అయితే ఈ యేడాది మాత్రం బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే టిటిడి పాలకమండలిలో ఇదే విషయంపై నిర్ణయం కూడా తీసేసుకున్నారు. వాహన సేవలన్నీ ఏకాంతంగానే జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో టిటిడి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను ఆన్లైన్లో ఉంచింది. ఈ నెల 15వ తేదీ, అలాగే 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. 15వ తేదీ అంకురార్పణ, 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ప్రత్యేక ప్రవేశ దర్సనం టిక్కెట్లు ఇవ్వాలని టిటిడి నిర్ణయించుకుని ఆన్లైన్లో టిక్కెట్లను విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితమే ఈ టిక్కెట్లను ఆన్లైన్లో ఉంచారు. అయితే భక్తులు పోటీలు పడి మరీ టిక్కెట్లను పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments