Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల కాటేజ్ వద్ద పది అడుగుల కొండ చిలువ.. బిత్తరపోయిన జనం

తిరుమల కాటేజ్ వద్ద పది అడుగుల కొండ చిలువ.. బిత్తరపోయిన జనం
, శనివారం, 29 ఆగస్టు 2020 (21:49 IST)
తిరుమలలో కొండల్లో లాక్ డౌన్ కారణంగా క్రూర మృగాలు సంచరిస్తున్నాయి. తాజాగా తిరుమలలో పది అడుగుల పొడవున్న కొండ చిలువ కలకలం సృష్టించింది. భక్తుల సంచారమున్న ప్రాంతంలోనే అది దర్శనమివ్వడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. 
 
జేఈఓ కార్యాలయంకు సమీపంలోని ఎస్ఎంసి కాటేజీ వద్ద చెట్టులోని కొమ్మకు పెనవేసుకొనున్న కొండ చిలువను చూసి భక్తులు బిత్తరపోయారు. దీని గురించి అధికారులకు సమాచారమిచ్చారు. అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని కొండ చిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. 
 
కొండ చిలువను చూసేందుకు యాత్రికులు తరలివచ్చి... తమ ఫోన్లలో ఫోటోలు తీసేందుకు పోటీపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. కొండ చిలువను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టినట్లు అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దివ్యాంగుడికి ఆపన్న హస్తం అందించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత