Webdunia - Bharat's app for daily news and videos

Install App

పితృపక్షకాలం: భీష్మాచార్యుల గొప్పదనం ఏంటో తెలుసుకుందాం...

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (22:54 IST)
మహా పితృపక్షకాలం జరుగుతున్న కాలంలో భీష్మాచార్యుల గొప్పదనం ఏంటో తెలుసుకుందాం... మహాభారతంలో భీష్మ పితామహునిది అత్యున్నతమైన పాత్ర. కురు వంశ పెద్దగా తన ధర్మాన్ని దాటలేక తప్పక కౌరవ పక్షాన నిలిచి చివరికి అంపశయ్య అసువులు బాసిన వారు భీష్ములు. 
 
ఆయన గంగా శంతనుల పుత్రుడు. అసలు దేవ పుత్రుడు. సవతి తల్లి అయిన సత్యవతికి ఇచ్చిన మాట కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. రాచరికాన్ని తుచ్ఛంగా పరిత్యజించిన మహోన్నతుడు. పాండవులందరినీ ఒంటిచేత్తో సంహరించగల అజేయమైన శక్తిమంతుడు భీష్ముడు. 
 
కృష్ణుడంతటివాడు తమ పక్షాన వున్నా భీష్ముని జయించే శక్తి లేక అంబను అడ్డుపెట్టుకుని ఆయనను అంశపయ్య పాలు చేశారు. పాండవులు. యుద్ధంలో రథసారథ్యం తప్ప ఆయుధాలు చేపట్టను అని ప్రతిన బూనిన శ్రీకృష్ణుడు భీష్ముని ప్రతాపాన్ని తాళలేక ఉగ్రుడై రథచక్రాన్ని ఎత్తి భీష్ముని పైకి వచ్చాడు. 
Bheeshma
 
తాను కోరినప్పుడే తనకు చావు రావాలన్న వరం పొందినవాడు భీష్ముడు. నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నా తాను నోరువిప్పనందుకు గాను శిక్షగా 58 రోజులు అంపశయ్యపైనే వున్నాడు. అలాంటి మహిమాన్వితుడిని పితృపక్షం జరుగుతున్న ఈ రోజుల్లో స్మరించుకుందాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

తర్వాతి కథనం
Show comments