తిరుమలకు పొంచి ఉన్న నీటి ముప్పు..

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (18:28 IST)
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు నీటి ముప్పు రాబోతోంది. తిరుమల గిరుల్లో ఉన్న జలాశయాల్లో నీరు రోజురోజుకూ అడుగంటుతోంది. దీంతో తిరుమలలో నీటి సమస్య మొదలవుతోంది. నిజానికి తిరుమలలో భక్తుల దాహార్తిని తీర్చేందుకు పసుపుధార, కుమారధార, పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ డ్యామ్‌లు ఉన్నాయి. వీటి నుండే తిరుమలలోని అన్ని అవసరాలకు నీటిని ఉపయోగిస్తుంటారు. 
 
అయితే గతేడాది శేషాచలం కొండల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో జలశయాలు పూర్తి స్థాయిలో నిండలేదు. ఇప్పటికే ఆకాశగంగ, గోగర్భం డ్యామ్‌లు ఎండిపోయినట్లు తితిదే అధికారులు చెప్తున్నారు. పసుపుధార, కుమారధార మరియు పాపవినాశంలో మాత్రమే ప్రస్తుతం నీరు అందుబాటులో ఉంది. 
 
వీటిలోని నీరు కూడా మూడు నుండి నాలుగు నెలలు మాత్రమే సరిపోతాయట..దీంతో నీటి పొదుపు చర్యలను చేపట్టింది తితిదే. అందులో భాగంగానే స్థానికంగా ఉండే బాలాజీనగర్‌లో ఐదురోజులకొకసారి, అలాగే హోటళ్లు, మఠాలకు రోజుకు రెండు పూటలకు కలిపి 8 గంటలపాటే నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే అద్దె గృహాలు, మరుగుదొడ్లలో సైతం తక్కువ నీటిని వినియోగించేటట్లు చర్యలు చేపట్టారు. 
 
గతంలో నీటి సమస్యను తట్టుకోవడానికి తెలుగుగంగలో నుండి నీటిని తిరుపతి తిరుమలకు నీటిని సరఫరా చేసారు. ఈసారి కూడా ఇలా చేసేందుకు వారు ఆలోచిస్తున్నారు. మరోవైపు వర్షాలు కురవాలని వరుణయాగం చేపట్టాలని తితిదే ఆలోచన చేస్తోంది. ఇందుకోసం తితిదే వారు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతిని సంప్రదించి సలహా తీసుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

కేంద్ర బడ్జెట్ 2026-27 : ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలు

కేంద్ర బడ్జెట్ 2026-27 : దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

రికార్డు స్థాయిలో లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

Himanshu post: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణ.. అయినా రిలాక్స్‌గా కేసీఆర్

అన్నీ చూడండి

లేటెస్ట్

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

తర్వాతి కథనం