Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పడితే.. జలుబు పరార్

వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పడితే.. జలుబు పరార్
, సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:21 IST)
జలుబు వస్తే అంత త్వరగా తగ్గదు. తుమ్ములు, దగ్గు మనల్ని బాధిస్తాయి. అలాగే తల, ఒళ్లు నొప్పులు, జ్వరం కూడా రావచ్చు. పారాసిటమల్ బిళ్ల వేసుకున్నా, ఇన్‌హేలర్స్ పీల్చినా ఉపయోగం ఉండదు. దీని నుండి ఉపశమనం పొందడానికి కొంత మంది అల్లం, తేనె కలిపిన టీని సిఫార్సు చేస్తారు. మరికొందరు నిమ్మకాయ తినమంటారు. చికెన్ సూప్ తాగినా కూడా జలుబు తగ్గుతుందని కొందరు నమ్ముతారు. 
 
ఏది ఏమైనా మనం జలుబు వస్తే జాగ్రత్త పడాలి. జలుబును అశ్రద్ధ చేస్తే అది ఆస్తమా, అలర్జీలుగా మారే అవకాశం ఉంది. జలుబు ఒక అంటువ్యాధి, అది తుమ్ములు, దగ్గు లేదా లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. ఇతరులకు సోకకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే జలుబు సాధారణంగా 7 నుండి 12 రోజుల లోపు తగ్గుతుంది. 
 
వైరస్ వల్ల వచ్చే ఇలాంటి వ్యాధులకు యాంటిబయోటిక్స్ తీసుకోవడం కంటే విశ్రాంతి తీసుకుంటే మేలు. వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడం లేదా నీటిని మరిగించి యూకలిప్టస్ ఆకులు వేసి ఆవిరి పట్టి విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బేకింగ్ సోడా, నిమ్మరసంతో అందమైన దంతాలు..