Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే...

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (19:00 IST)
గురువు ఖ్వలిదం బ్రహ్మ. ఈ సర్వమూ బ్రహ్మమే.... అని వేదాలు చెబుతున్నాయి. ఆ బ్రహ్మమే, ఆ భగవంతుడే తానైనవాడు మాత్రమే గురువు. ఈ కాలంలో అజ్ఞులైన ప్రజలందరికి స్థూలమైన అనుభవాల ద్వారా సర్వదేవతలు, మహాత్ములు, జీవులే కాక జడమని తలచబడే పూజా విగ్రహాలు, పటాలు కూడా తమ రూపమేనని తెలిపినవారు శ్రీసాయి ఒక్కరేనేమో.
 
బాబా దేహంతో ఉన్న రోజుల్లో శిరిడీలో ఒకనాటి మద్యాహ్నం శ్రీమతి తార్ఖాడ్ వడ్డన చేస్తుంటే, ఆకలిగొన్న కుక్క ఒకటి వచ్చి జాలిగా చూసింది. వెంటనే ఆమె ఒక రొట్టె వేస్తే ఆత్రంగా తిని వెళ్లిపోయింది. నాటి సాయంత్రం మశీదులో సాయి ఆమెతో తల్లీ... నీవు పెట్టిన రొట్టెతో నా ఆకలి, ప్రాణాలు కుదుటపడ్డాయి అన్నారు.
 
ఆమె ఆశ్చర్యంతో నేను మీకెప్పుడు అన్నం పెట్టాను అన్నది... మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే... అన్ని జీవుల రూపాలలోనూ నేనే ఎప్పుడూ ఉంటాను. ఆకలిగొన్న ప్రాణికి పెట్టాక నీవు తింటుండు... నీకెంతో మేలవుతుంది. మశీదులో కూర్చొని నేనెన్నడు అబద్దం చెప్పను అన్నారు బాబా.
 
మరొకసారి లక్ష్మీబాయిషిండే వచ్చి నమస్కరించగానే అమ్మా.... నాకెంతో ఆకలిగా ఉందన్నారు. ఆమె వెంటనే వెళ్లి రొట్టెలు, కూర చేసుకొచ్చింది. కానీ.... బాబా వాటిని ప్రక్కన ఉన్న కుక్కకి వేశారు, ఆమె చిన్నబుచ్చుకుని మీకోసమని శ్రమపడి చేసుకొచ్చాను బాబా అన్నది.... అప్పుడు బాబా... దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే... దానికి నోరు లేకపోవచ్చు కానీ ఆత్మ ఉన్నది. ఆకలిగొన్న ప్రాణికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే అన్నారు. 
 
నాటి నుండి రోజూ అదే సమయానికి ఆమె నియమంగా జీవితాంతం సాయినాధునికి రొట్టె సమర్పించింది. అందుకే బాబా సమాధి చెందే ముందు ఆమెను అనుగ్రహించి నవవిధ భక్తులకు సంకేతంగా తొమ్మిది నాణాలు సమర్పించారు. ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడనే విషయం బాబా మనకు స్పష్టంగా తెలియజేశారు.. కాబట్టి ఏ జీవిని మనం అసహ్యించుకోగూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

లేటెస్ట్

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments