భాగవత శ్రవణంతో మోక్షప్రాప్తి...

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (12:30 IST)
లౌకికమైన బంధాల్లో చిక్కుకున్న మనిషిని సంసారబంధనాల నుంచి విముక్తిడిని చేసి కైవల్యానికి మార్గం చూపే దారిదీపంగా భాగవతం నిలుస్తుందని, కేవలం భాగవతాన్ని వినటంతోనే ముక్తి లభిస్తుందని ప్రముఖ పండితులు, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయశాస్త్రి అన్నారు. 
 
లబ్బీపేటలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యాన అక్కడి శ్రవణమంటపంలో శనివారం భాగవత సప్తాహం ప్రారంభమైంది. దత్తాత్రేయశాస్త్రి ప్రచనం చేస్తూ పరీక్షిత్తు మహారాజుకు ఇచ్చిన శాపం లోకానికి వరంగా మారిందన్నారు. 
 
భగవంతుడి లీలల్లో అనేకమైన అంతరార్థాలు దాగి ఉంటాయని, విచక్షణ కోల్పోయి వితండవాదంతో పరమాత్మ లీలల్ని ప్రశ్నించటం సరికాదన్నారు. అనంతమైన సాహిత్యాన్ని సృష్టించిన వ్యాసమహర్షికి సైతం భాగవత రచన వల్లే సాంత్వన చేకూరించదన్నారు. 
 
భాగవతం కేవలం భగవంతుడి కథల సమాహారం మాత్రమే కాదని, అనంతమైన ఆధ్యాత్మిక, వైజ్ఞానిక విషయాలకు నిలయమని చెప్పారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి శిష్యులు నారాయణేంద్ర సరస్వతీస్వామి, కైవల్యానంద సరస్వతి, శంకరానంద సరస్వతీస్వామి కూడా పాల్గొన్నారు. 
 
తొలుత విఘ్నేశ్వరపూజ, అనంతరం శాస్త్రవిధానంగా అర్చన చేసి సప్తాహాన్ని ప్రారంభించారు. దేవస్థాన పాలకమండలి అధ్యక్షుడు మాగంటి సుబ్రహ్మణ్యం కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

భోగి పండుగ - పొంగలి తయారు చేసిన ప్రధాని మోడీ

కారుతో బీభత్సం కేసు : రౌడీ షీటర్లకు ఖాకీ మార్క్ ట్రీట్మెంట్

ఆమె ఎవరు.. నీ పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నావు...

ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. ఠాణాలో ఖాకీల సమక్షంలోనే కాల్పులు జరిపిన భర్త

అన్నీ చూడండి

లేటెస్ట్

13-01-2026 మంగళవారం ఫలితాలు - రుణ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి..

2026లో రాశుల వారీగా ఫలితాలు- పరిహారాలు క్లుప్తంగా...

Makar Sankranti 2026 astrology: సంక్రాంతి రోజున రాజయోగం.. ఈ రాశులకు అదృష్టం

భోగి, మకర సంక్రాంతి, కనుమలకు ప్రత్యేకంగా ఏమి చేస్తారు?

12-01-2026 సోమవారం ఫలితాలు - ఆదాయానికి తగ్గట్టగా ఖర్చులుంటాయి...

తర్వాతి కథనం
Show comments