Pradosham: ప్రదోష సమయలో నరసింహ స్వామిని పూజించాలి.. ఎందుకంటే?

సెల్వి
శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (12:07 IST)
Narasimha Avatar
ప్రదోష సమయలో మహేశ్వరునితో పాటు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ప్రదోషకాలంలో శివునికి మాత్రమే అభిషేకం కాదు.. మహా విష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహ స్వామిని పూజించడం.. ఆయనకు జరిగే అభిషేకాదులలో పాల్గొనడం ద్వారా అప్పుల బాధలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. 
 
లక్ష్మీ నరసింహ స్వామిని, సత్యనారాయణ స్వామిని ప్రదోష వేళలో పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. లక్ష్మీ నరసింహ స్వామికి తిరుమంజన సేవలు చేయించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ప్రదోషం సమయంలో నరసింహ స్వామిని ఆరాధించడం వల్ల ప్రత్యేకంగా రుణబాధలు, మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. 
 
ప్రదోషం అనేది సంధ్యా సమయం. ఇది సాధారణంగా శివుడితో ముడిపడి ఉంటుంది. విష్ణు భక్తులకు ప్రదోషం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నరసింహ అవతారం ఈ సమయంలో జరిగింది. వైశాఖ శుక్ల చతుర్దశి నాడు ప్రదోష సమయంలో హిరణ్యకశిపుడు ప్రసరింపజేసిన అధర్మాన్ని లోకం నుండి తొలగించడానికి నరసింహుడు కనిపించాడు.
 
 
కఠోర తపస్సు ఫలితంగా రాక్షసుడు హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి ఒక వరం పొందాడు. అతను మనిషి లేదా జంతువు చేత చంపబడడు. ఇంటి లోపల లేదా బయట లేదా పగలు లేదా రాత్రి చంపబడడు. ఆ రాక్షసుడు తెలివిగా అలాంటి వరం కోరాడు. అలా తనకు మరణం వుండదని నమ్మాడు. 
 
కానీ పుట్టుక అంటూ వుంటూ చావనేది తప్పదు. ప్రహ్లాదుడి భక్తి ఫలితంగా నరసింహుడు అవతరించాడు. సింహం ముఖంతో మానవ దేహంతో హిరణ్యకశిపుడిని వధించాడు. తనను పగలు లేదా రాత్రి చంపవద్దని హిరణ్య కశిపుడు కోరాడు. పగలు లేదా రాత్రి లేని సమయంలో నరసింహుడు ప్రదోషంలో వధించాడు. విష్ణు భక్తులు ఆ సమయంలో మౌన వ్రతం చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగిసంగటిలో బొద్దింక ... ఉలిక్కిపడిన హైదరాబాద్ ఆహార ప్రియులు

మరో ఆరు నెలల్లో విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయ్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

గెలిచిన తర్వాత పార్టీ మారితే ఇంటికొచ్చి చితక్కొడతాం : భారాస ఎమ్మెల్యే వార్నింగ్

అమ్మవారి వేడుకల్లో భార్యతో కలిసి నృత్యం.. అంతలోనే భర్త అనతలోకాలకు...

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

లేటెస్ట్

05-10-2025 నుంచి 11-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

అక్టోబరు 2025లో జాక్‌పాట్ కొట్టనున్న 4 రాశుల వారు

ఈ రోజు శని మహా ప్రదోషం.. శివాలయానికి వెళ్లి పూజ చేయడం తప్పనిసరి

04-10-2025 శనివారం దిన ఫలితాలు - ఖర్చులు సామాన్యం.. చెల్లింపుల్లో జాగ్రత్త...

Tirumala : శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రూ.25 కోట్లకు పైగా కానుకలు

తర్వాతి కథనం
Show comments