Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయాల్లో తీర్థం ఎందుకు ఇస్తారో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (11:52 IST)
ఆలయాలకు వెళ్లాలంటే ఇష్టపడని వారుండరు. సాధారణంగా ఆలయాలకు వెళ్లినప్పుడు పూజ పూర్తయిన తరువాత తీర్థాన్ని ఇస్తారు. అదీ ఒక్కటి కాదు రెండు కాదు మూడుసార్లు ఇస్తారు. అలా ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం..
 
మెుదటిసారి తీసుకునే తీర్థం శరీరశుద్ధికి, రెండవ సారి తీసుకునేది ధర్మసాధనకు, మూడోసారి తీసుకునేది పరమపదం కోసమని పండితులు చెబుతున్నారు. అలానే కొన్ని ఆలయాల్లో ఆ తీర్థాన్ని రాగి పాత్రలో ఇస్తుంటారు. రాగి పాత్ర ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో.. అదేవిధంగా పూజలకు అంతే మంచి చేస్తుందని విశ్వాసం. 
 
చాలామంది తీర్థం తీసుకున్న తరువాత దానిని తాగి ఆ తీర్థాన్ని తలకు అంటుకుంటారు. అలా చేస్తే పాపాలు తొలగిపోతాయని వారి నమ్మకం. కానీ, అది నిజం కాదు.. అసలు తీర్థాన్ని తలకు అంటకూడదు. ఆలయాల్లో తీర్థం ఎందుకు ఇస్తారంటే.. దానిని ఎవరైతే తీసుకుంటున్నారో వారికి గల దోషాలు, పాపాలు తొలగిపోవాలని ఇస్తారు.

కానీ, తీసుకునే వారు మాత్రం వాటిని తొలగించుకోకుండా.. తలకు అంటుకుంటుంటారు. ఇలా చేస్తే మీ దోషాలు, పాపాలు ఇంకా ఎక్కువవుతాయని నిపుణులు చెప్తున్నారు. కనుక తీర్థం తీసుకున్న తరువాత దానిని తాగి మీ వస్త్రాలతో శుభ్రం చేసుకోండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

లేటెస్ట్

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

తర్వాతి కథనం
Show comments