Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో బంగారు బల్లులు... విచిత్ర శబ్దాలు, వాటి కథేంటి?

బల్లులంటే భయపడేవారు చాలామందే ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ బల్లులు ఉంటాయి. ఇంట్లో కాని, చెట్ల మీద గాని బల్లులను చూస్తూ ఉంటాం. బల్లులు సాధారణంగా గ్రే కలర్‌లో గాని, మట్టి కలర్‌లో గాని ఉంటాయి. తిరుమలలో గత వారంరోజులుగా బంగారు బల్లులు తిరుగుతుండటాన్ని భక్తులు గ

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (17:10 IST)
బల్లులంటే భయపడేవారు చాలామందే ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ బల్లులు ఉంటాయి. ఇంట్లో కాని, చెట్ల మీద గాని బల్లులను చూస్తూ ఉంటాం. బల్లులు సాధారణంగా గ్రే కలర్‌లో గాని, మట్టి కలర్‌లో గాని ఉంటాయి. తిరుమలలో గత వారంరోజులుగా బంగారు బల్లులు తిరుగుతుండటాన్ని భక్తులు గుర్తించారు. 
 
అసలు బంగారు బల్లి కథేంటి... గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. నదీ తీరానికి వెళ్ళి నీటిని తీసుకొచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. నీటిలో బల్లి ఉండటాన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించారు. శాప విముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి ప్రార్థించారు. 
 
కొన్నాళ్ళకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉండటంతో బంగారు వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు. బంగారు బల్లిని తాకడంతో అప్పటివరకు చేసిన పాపాలు పోతాయన్న నమ్మకం చాలామందిలో ఉంది. అలాంటిది అసలుసిసలు బంగారు బల్లి కనిపిస్తే.. దీనిపైనే ప్రస్తుతం ఆశ్చర్యపోతున్నారు భక్తులు. 
 
శేషాచలం అడవులు తిరుమల శ్రీవారి ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఉన్న శిలాతోరణం సమీపంలోని చక్రతీర్థ ప్రాంతంలో బల్లులను గుర్తించారు. ఈ బల్లులను గెకో అంటారు. గత కొన్ని సంవత్సరాలకు ముందు కనిపించిన ఈ బల్లులు ఆ తరువాత కనిపించలేదు. తాజాగా వారం రోజుల క్రితం కనిపించాయి. ఇవి జనాన్ని చూసి కూడా భయపడటం లేదు. ఒక్కోసారి విచిత్రంగా అరుస్తున్నట్లు జూ అధికారులు గుర్తించారు. ఈ బల్లులపై మరోసారి పరిశోధన జరపాలని వన్యప్రాణి సంరక్షణా విభాగం నిర్ణయించుకుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments