ప్రదక్షణలు వేయడం వలన ఫలితం ఏంటో?

దేవాలయానికి ఎప్పుడు వెళ్లినా కాస్తంత తీరిక చేసుకుని వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే మనస్సులో భగవంతుడిని నిలుపుకోవడానికి ఆయన నామాన్ని స్మరిస్తూ ప్రదక్షణలు చేయడానికి కనులారా దైవాన్ని దర్శిచండాని

Webdunia
గురువారం, 19 జులై 2018 (13:13 IST)
దేవాలయానికి ఎప్పుడు వెళ్లినా కాస్తంత తీరిక చేసుకుని వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే మనస్సులో భగవంతుడిని నిలుపుకోవడానికి ఆయన నామాన్ని స్మరిస్తూ ప్రదక్షణలు చేయడానికి కనులారా దైవాన్ని దర్శిచండానికి తీర్థప్రసాదాలు స్వీకరించిన తరువాత కాసేపు అక్కడ కూర్చుని భగవంతుడిని తలచుకోవడానికి కొంత సమయం అవసరమవుతుంది.
 
కొంతమంది పనుల ఒత్తిడి కారణంగా వెంటనే తిరిగ వెళ్లి పోవాలనే ఉద్దేశంతో ప్రదక్షణలు చేయకుండానే నేరుగా ముఖమండపంలోకి వెళ్లి దైవదర్శనం చేసుకుంటుంటారు. ప్రదక్షణ వలన జన్మజన్మల పాపాలు నశిస్తాయని, విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది. ప్రదక్షణలు చేయనివాళ్లు పాపాలను ప్రక్షాళన చేసుకునే అవకాశాన్ని, పుణ్యఫలాలను అందుకునే అదృష్టాన్ని కోల్పోయినట్లవుతుంది.
 
అందువలన ఆలయానికి వెళ్లగానే కాళ్లు కడుక్కుని నీరు పుక్కిలించి తలపై కాసిన్ని నీళ్లు చల్లుకుని ముందుగా ప్రదక్షణలు చేయాలి. అడుగుల శబ్దం రాకుండా నిదానంగా ప్రదక్షణలు పూర్తిచేసిన తరువాతనే దైవదర్శనం చేసుకోవాలి. భగవంతుడి సన్నిధిలో నిలబడే అర్హతను ప్రసాదించేవి ప్రదక్షణలేననే విషయాన్ని ఎప్పటికి మరచిపోకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దావోస్‌లో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం- బ్లైజ్

అటు ఫోన్ ట్యాపింగ్‌ - ఇటు లిక్కర్ స్కామ్.. జోరుగా విచారణలు

తెలంగాణలోని కొల్లాపూర్‌లో గ్రంథాలయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచిన డియాజియో ఇండియా

ట్రాఫిక్‌లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అన్నీ చూడండి

లేటెస్ట్

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

18-01-2026 నుంచి 24-01-2026 వరకు వార రాశి ఫలితాలు

17-01-2026 శనివారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments