Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం శ్రీవారికి వ్రతమాచరిస్తే..?

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (05:00 IST)
శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శనివారం వ్రతమాచరించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అందుకే శనివారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి వ్రతానికి ఉపక్రమించాలి. 
 
ముందుగా మండపాలంకరణ, కలశారాధన, విఘ్నేశ్వర పూజ పూర్తి చేసి తర్వాత శ్రీవేంకటేశ్వర స్వామివారికి షోడష ఉపచారాలతో పూజ చేయాలి. ఇందులో భాగంగా అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. వ్రతంలో భాగంగా శనివార వ్రత కథను చదువుకోవాలి.
 
వ్రత ఫలితంగా నవగ్రహాల అనుకూలతను కోరుకునేవారు ఆముదం, నువ్వుల నూనె, ఆవు నెయ్యి కలిపి, నలుపు, ఎరుపు, నీలిరంగు వత్తులతో దీపారాధన చేయాలి. అలాగే నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఉపవాసం ఆచరించి ఈ పూజకు ఉపవాసం తప్పనిసరి. రాత్రి వరకూ ఉండి పండ్లు, పాలు తీసుకోవచ్చు. ఏడువారాలు ఇలా శనివారం వ్రతమాచరించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
చివరి వారం ఉద్యాపనగా నలుపు రంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం మొదలైనవి దానంగా ఇవ్వాలి. ఈ పూజ, వ్రతం భక్తిశ్రద్ధలతో కూడుకున్నదిగా వుంటుంది. హంగు, ఆర్భాటాలకు దూరంగా వుండాలి. వ్రతమాచరించే రోజు పవిత్రంగా ఉండాలి. ధర్మబద్ధంగా వ్యవహరించాలి. వ్రతం చేస్తున్న శనివారాలు వంకాయలు, నల్ల మిరియాలు, మినపప్పులను కొనకూడదు, తినకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్.. ఎందుకంటే?

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు

చిత్తూరులో భారీ వర్షాలు-టమోటా రైతుల కష్టాలు.. వందలాది ఎకరాల పంట నీట మునక

బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్‌‌.. పొంగలిలో పురుగు.. అదంతా సోషల్ మీడియా స్టంటా?

విమానం గగనతలంలో ఉండగా ప్రయాణికుడు మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

జూలై 23న మాస శివరాత్రి.. ఆరుద్ర నక్షత్రం తోడైంది.. సాయంత్రం శివాలయంలో?

23-07-2025 బుధవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య 2025: వ్రత కథ.. పితృదేవతలకు తర్పణం ఇవ్వకపోతే?

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య రోజున ఏం చేయాలి?

Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments