Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం ప్రదోషం: సాయంత్రం పాలు, పెరుగు అభిషేకానికి సమర్పిస్తే?

సెల్వి
శనివారం, 28 డిశెంబరు 2024 (12:04 IST)
శనివారం వచ్చే ప్రదోషం రోజున సూర్యోదయం నుంచి రోజంతా ఉపవాసం చేసి, సాయంత్రం వేళ శివార్చన చేయడం ద్వారా సమస్త జాతక దోషాలు పోయి అనుకున్న కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. శనివారం మధ్యాహ్నం త్రయోదశి తిథి ఉన్న రోజున సాయంత్రం 4.30 నుంచి 6 వరకు గల సమయాన్ని ప్రదోషకాలం అంటారు.
 
ఈ సమయంలో గంగాజలంతో, ఆవు పాలతో శివునికి అభిషేకం చేయించి, బిల్వ పత్రాలు, శంఖుపూలు సమర్పించుకుని శివాష్టకం పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. సమస్త జాతక దోషాలు పోతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. 
 
శని ప్రదోషం సమయంలో శివాభిషేకం చేయడానికి వీలు కాని వారు కనీసం తమ ఇంట్లో ప్రదోష వేళలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శనిదోషాలు తొలగిపోతాయి. ఇంకా ప్రదోష సమయంలో జరిగే అభిషేకాలను కళ్లారా చూడటం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. 
 
డిసెంబర్ 28వ తేదీ శనివారం సూర్యాస్తమయం సమయంలో త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఆ రోజు శని ప్రదోష పూజను చేసుకోవాలి. ఈ రోజున శివునికి పాలు, పెరుగు అభిషేకానికి సమర్పించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. కేసు నమోదు

ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. ఆ జిల్లాల్లో 50 బస్సులు

ప్రియురాలిని సూట్‌‍కేసులో దాచిపెట్టీ.... ప్రియుడి సాహసం (Video)

అయోధ్య గెస్ట్ హౌస్‌లో మహిళ స్నానం చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

09-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : చీటికిమాటికి చికాకుపడతారు...

బుధవారం రోజున పూజ ఎలా చేయాలి? భార్యాభర్తలు కలిసి ఆచరిస్తే?

తర్వాతి కథనం
Show comments