Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవనూనె, పామాయిల్‌తో దీపమెలిగించారో.. ఇక అంతే సంగతులు?! (video)

Webdunia
బుధవారం, 15 జులై 2020 (15:40 IST)
రోజూ మనం వెలిగించాల్సిన దీపాల కోసం మనం వినియోగించే నూనెల గురించి తెలుసుకుందాం.. రోజూ ఉదయం లేదా సాయంత్రం పూట దీపారాధన చేయడం మంచిది. దీపారాధన మహిళలే చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది.

సాయంత్రం పూట ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత దీపాన్ని వెలిగించి పూజ చేయాలి. దీపానికి నెయ్యి, వేపనూనె, కొబ్బరి నూనె, ఆముదం వంటి వాటిని కలిపి వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. 
 
నేతితో దీపం వెలిగించడం ద్వారా సకల సంతోషాలు చేకూరుతాయి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా గృహంలోని ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి. దోషాలుండవు.

ఆముదంతో దీపం వెలిగిస్తే.. కీర్తిప్రతిష్ఠలు చేకూరుతాయి. సిరిసంపదలు చేకూరుతాయి. దారిద్ర్యం తొలగిపోతుంది. ఆవు నేతితో దీపం వెలిగిస్తే దంపతుల మధ్య కలహాలుండవు. అన్యోన్యత పెంపొందుతుంది.

ఇంటి దేవత అనుగ్రహం పొందాలనుకునేవారు ఆముదంతో దీపాలను వెలిగించాలి. వంశవృద్ధికి ఆముదంతో ఇంట దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
అయితే ఆవనూనె, పామాయిల్, వేరుశెనగల నూనెను దీపారాధానకు ఉపయోగించకూడదు. ఇంట్లోనే కాకుండా ఆలయాల్లో ఈ నూనెను దీపారాధనకు వాడకూడదు. ఈ నూనెలతో దీపమెలిగిస్తే ఇబ్బందులు, ఈతిబాధలు, పాపాలు, దోషాలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments