Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కరోనా భయం .. కనిపించని భక్తుల సందడి

Webdunia
బుధవారం, 15 జులై 2020 (11:45 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కరోనా వైరస్ ఆవహించింది. ఫలితంగా నిత్యం భక్తులతో సందడిగా కనిపించే తిరుమల గిరులు భక్తుల రద్దీ లేక బోసిబోయి కనిపిస్తున్నారు. అసలే లాక్డౌన్ ఆంక్షలతో అరకొర భక్తులతో కనిపించే శ్రీవారి పుణ్యక్షేత్రం.. కరోనా భయం కారణంగా భక్తుల తాకిడి గణనీయంగా తగ్గిపోయింది. 
 
నిజానికి కరోనా లాక్డౌన్‌కు ముందు ప్రతి రోజూ కనీసం 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. ఈ సంఖ్య వారంతాల్లో, సెలవుల్లో అయితే భక్తుల సంఖ్య లక్ష దాటేది. భక్తుల గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మారుమ్రోగేవి. 
 
కానీ ఇప్పుడలాలేదు. కరోనా భయంతో భక్తులు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. లాక్డౌన్ ఆంక్షలు సడలించి భక్తులను దర్శనానికి అనుమతించడం మొదలుపెట్టాక ఇంతవరకు స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య కేలవం 2.50 లక్షలు మాత్రమే. 
 
అయితే తిరుమలకు వెళ్లిన భక్తులు ఎవరికీ ఇంతవరకు కరోనా సోకలేదు. కానీ, తితిదే ఉద్యోగుల్లో 91 మందికి పాజిటీవ్ నిర్ధారణ అయింది. దీంతో భక్తులు కూడా తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా తిరుమల భక్తుల సందడి పెద్దగా లేకుండా కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments