Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కరోనా భయం .. కనిపించని భక్తుల సందడి

Webdunia
బుధవారం, 15 జులై 2020 (11:45 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కరోనా వైరస్ ఆవహించింది. ఫలితంగా నిత్యం భక్తులతో సందడిగా కనిపించే తిరుమల గిరులు భక్తుల రద్దీ లేక బోసిబోయి కనిపిస్తున్నారు. అసలే లాక్డౌన్ ఆంక్షలతో అరకొర భక్తులతో కనిపించే శ్రీవారి పుణ్యక్షేత్రం.. కరోనా భయం కారణంగా భక్తుల తాకిడి గణనీయంగా తగ్గిపోయింది. 
 
నిజానికి కరోనా లాక్డౌన్‌కు ముందు ప్రతి రోజూ కనీసం 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. ఈ సంఖ్య వారంతాల్లో, సెలవుల్లో అయితే భక్తుల సంఖ్య లక్ష దాటేది. భక్తుల గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మారుమ్రోగేవి. 
 
కానీ ఇప్పుడలాలేదు. కరోనా భయంతో భక్తులు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. లాక్డౌన్ ఆంక్షలు సడలించి భక్తులను దర్శనానికి అనుమతించడం మొదలుపెట్టాక ఇంతవరకు స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య కేలవం 2.50 లక్షలు మాత్రమే. 
 
అయితే తిరుమలకు వెళ్లిన భక్తులు ఎవరికీ ఇంతవరకు కరోనా సోకలేదు. కానీ, తితిదే ఉద్యోగుల్లో 91 మందికి పాజిటీవ్ నిర్ధారణ అయింది. దీంతో భక్తులు కూడా తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా తిరుమల భక్తుల సందడి పెద్దగా లేకుండా కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

ద్యావుడా!! దేవుడు లాంటి భర్తను బైకు వెనుక కూర్చుని చెప్పుతో కొట్టిన భార్య

Nara Lokesh: పవన్ అన్నకు అభినందనలు: నారా లోకేష్ ట్వీట్

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments