తిరుమలలో కరోనా భయం .. కనిపించని భక్తుల సందడి

Webdunia
బుధవారం, 15 జులై 2020 (11:45 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కరోనా వైరస్ ఆవహించింది. ఫలితంగా నిత్యం భక్తులతో సందడిగా కనిపించే తిరుమల గిరులు భక్తుల రద్దీ లేక బోసిబోయి కనిపిస్తున్నారు. అసలే లాక్డౌన్ ఆంక్షలతో అరకొర భక్తులతో కనిపించే శ్రీవారి పుణ్యక్షేత్రం.. కరోనా భయం కారణంగా భక్తుల తాకిడి గణనీయంగా తగ్గిపోయింది. 
 
నిజానికి కరోనా లాక్డౌన్‌కు ముందు ప్రతి రోజూ కనీసం 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. ఈ సంఖ్య వారంతాల్లో, సెలవుల్లో అయితే భక్తుల సంఖ్య లక్ష దాటేది. భక్తుల గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మారుమ్రోగేవి. 
 
కానీ ఇప్పుడలాలేదు. కరోనా భయంతో భక్తులు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. లాక్డౌన్ ఆంక్షలు సడలించి భక్తులను దర్శనానికి అనుమతించడం మొదలుపెట్టాక ఇంతవరకు స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య కేలవం 2.50 లక్షలు మాత్రమే. 
 
అయితే తిరుమలకు వెళ్లిన భక్తులు ఎవరికీ ఇంతవరకు కరోనా సోకలేదు. కానీ, తితిదే ఉద్యోగుల్లో 91 మందికి పాజిటీవ్ నిర్ధారణ అయింది. దీంతో భక్తులు కూడా తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా తిరుమల భక్తుల సందడి పెద్దగా లేకుండా కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

40 రోజుల్లో నమాజ్ నేర్చుకోవాలి.. మతం మారిన తర్వాతే వివాహం.. ప్రియురాలికి ప్రియుడు షరతు.. తర్వాత

మరో వ్యక్తితో సన్నిహితంగా వుంటోందని వివాహితను హత్య చేసిన మొదటి ప్రియుడు

రూ.2.7 కోట్ల విలువైన 908 కిలోల గంజాయి స్వాధీనం.. ఎలా పట్టుకున్నారంటే?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తే పెద్దమ్మ గుడి కట్టిస్తా : బండి సంజయ్

Jagan: బాలయ్య మద్యం మత్తులో అసెంబ్లీలో మాట్లాడారు.. వైఎస్ జగన్ ఫైర్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీకి రూ.900 కోట్లు-ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో పెరిగిన విరాళాలు

Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. దీపారాధన, దీపదానం.. బిల్వార్చన చేస్తే?

22-10-2025 బుధవారం దినఫలాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం.. నిర్విరామంగా శ్రమిస్తారు...

21-10-2025 మంగళవారం దినఫలాలు - ఆత్మీయులతో సంభాషణ మనోధైర్యాన్నిస్తుంది...

20-10-2025 సోమవారం దినఫలాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

తర్వాతి కథనం
Show comments