Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఎందుకు చేశారంటే..?

Advertiesment
Koil alwar Tirumanjanam
, మంగళవారం, 14 జులై 2020 (23:09 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈరోజు ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆలయాన్ని శుద్ధి చేశారు సిబ్బంది. 
 
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం టిటిడికి ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. 
 
అందులో భాగంగా ఈరోజు కూడా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌తో పాటు తిరుమల టిటిడి ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డిలు, టిటిడి ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ పండ్లు కలలో అగుపిస్తే ప్రేయసీప్రియులకు...