Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనిదోషాల నివారణకు ఇలా చేస్తే..?

చాలామంది శనిదోషాలతో బాధపడుతుంటారు. ఈ దోషాలను తొలగించుకోవడానికి ఎన్నెన్నో ఆలయాలకు వెళ్ళి పూజలు చేస్తుంటారు. అయినా కూడా ఈ శనిదోషాల నుండి విముక్తి లభించలేదు.

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (15:16 IST)
చాలామంది శనిదోషాలతో బాధపడుతుంటారు. ఈ దోషాలను తొలగించుకోవడానికి ఎన్నెన్నో ఆలయాలకు వెళ్ళి పూజలు చేస్తుంటారు. అయినా కూడా ఈ శనిదోషాల నుండి విముక్తి లభించలేదు. అందుకు ఈ నామాన్ని స్మరిస్తే దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
 
''శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ''
 
అనే మంత్రాన్ని జపిస్తే కొంతవరకైన దోషాలు నివారించవచ్చని పురాణాలలో చెబుతున్నారు. అలానే విజయదశమి నాడు సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం తరువాత జమ్మిచెట్టు వద్దగల అపరాజితాదేవిని ఆరాధించి పైన చెప్పిన శ్లోకాన్ని జపిస్తూ జమ్మిచెట్టును ప్రదక్షణలు చేయాలి. ఈ శ్లోకాన్ని కాగితాలలో రాసుకుని జమ్మిచెట్టు కొమ్మలకు తగిలించాలి. 
 
దశమి నాడు ఇలా చేయడం వలన కోరిక వరాలు, కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. దాంతో శనిగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. శ్రీరామ చంద్రుడు, విజయదశమి, విజయ కాలము నందు ఈ శమీ పూజను చేసి లంకపై జైత్రయాత్రను మెుదలుపెట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీని వలనే హిందూవులందరు దీనిని విజయ ముహూర్తంగా భావిస్తారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments