కార్తీక మాసంలో ఆ కూరగాయలు వాడకూడదు...

కార్తీక మాసం పరమేశ్వరునికి ప్రీతికరమైనది. ఆ కార్తీక మాసంలో శివుని ఆరాధించిన వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయన్నది విశ్వాసం.

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (12:41 IST)
కార్తీక మాసం పరమేశ్వరునికి ప్రీతికరమైనది. ఆ కార్తీక మాసంలో శివుని ఆరాధించిన వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయన్నది విశ్వాసం. ముఖ్యంగా చాలామంది ఈ మాసంలో తులసి మాలలు ధరించి ఉసిరి చెట్టును పూజిస్తుంటారు. ఇలా చేస్తే సకలసంపదలు చేకూరుతాయని విశ్వాసం.
 
కార్తీకమాసంలో కార్తీక పురాణం 30 అధ్యాయాల్లో రోజుకు ఓ అధ్యాయం పారాయణం చేస్తే శుభదాయకమని చెప్తున్నారు. ఈశ్వరుని అశుతోషుడు అని కూడా పిలుస్తారు. భక్తులు కోరిన వరాలను తక్షణమే ప్రసాదించే భగవానుడు పరమేశ్వురుడే. కనుక శివ మంత్రాన్ని స్మరిస్తూ స్వామివారికి అలంకారాలు, నైవేద్యాలు సమర్పించి పూజలు చేయాలని పురాణాలలో చెప్పబడి వుంది. 
 
కార్తీక నియమాన్ని పాటించేవారు వీటిని తీసుకోకూడదు. అవేంటంటే.. ఇంగువ, ఉల్లి, ముల్లంగి, ఆనపకాయ, మునక్కాయ, వంకాయ, గుమ్మడి కాయ, చిక్కుడు, వెలగపండ్లు వంటి వాటిని వంటల్లో చేర్చుకోరాదు. అలానే మిగిలిన అన్నం, మాడన్నం, మినుములు, పెసలు, శెనగలు, ఉలవలు కూడా వాడకూడదు. ముఖ్యంగా కార్తీక నెలలో వచ్చే ఆదివారం నాడు, సప్తమినాడు ఉసిరికాయ, అష్టమినాడు కొబ్బరిని వాడకూడదని శాస్త్రం చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీవీఎల్ అనేది కొత్త రాజకీయ పార్టీనా..? రఘురామ కృష్ణం రాజు ఏమన్నారు?

NEET-UG 2026: నీట్ రద్దు.. అందుబాటులోకి రీఫండ్ సదుపాయం.. చివరి గడువు మే 27, 2026

సీఎం విజయ్‌ సలహాదారులలో తెలుగు వ్యాపారవేత్త విష్ణువర్ధన్ రెడ్డి

ఇరాన్‌పై భీకర దాడులకు అమెరికా ప్లాన్... కుమారుడి పెళ్లికి దూరంగా ట్రంప్

విమాన ప్రయాణాలకు పవన్ సొంత డబ్బునే వాడతారు.. జగన్‌కు షాకిచ్చిన నాదెండ్ల

అన్నీ చూడండి

లేటెస్ట్

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తిరుమలలో భారీ రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటలు.. ఎండల్ని లెక్కచేయకుండా..

22-05-2026 శుక్రవారం ఫలితాలు - అనుకూలతలు అంతంత మాత్రమే

21-05-2026 గురువారం ఫలితాలు - రుణ విముక్తులవుతారు

తర్వాతి కథనం
Show comments