ఇంటికి వెనుక కలబంద మొక్క.. శివాలయంలో పెరుగన్నం దానం చేస్తే? (video)

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (14:59 IST)
ఆదాయం వస్తూనే వున్నా.. ఖర్చు మాత్రం దానికి తగ్గట్టుగానే వస్తోందా? ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవట్లేదా? ఆర్థికంగానే కాకుండా, మానసికంగా ఇబ్బందులు వెంటాడుతున్నాయా? అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోండి అంటున్నారు.. ఆధ్యాత్మిక నిపుణులు. వృత్తిలో రాణించడం కోసం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలను దూరం చేసుకోవాలనుకుంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ చిట్కాలు పాటించాలని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు.
 
అవేంటంటే? రోజూ అన్నం వండేందుకు బియ్యం తీస్తున్నప్పుడు.. గుప్పెడు బియ్యాన్ని వేరొక మట్టి కుండలో వేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా 21 రోజులు తీసిపెట్టిన గుప్పెడేసి బియ్యంతో పెరుగన్నంగా తయారు చేసి.. ఏదేని శివాలయంలో అన్నదానం చేయాలి. ఇలా వరుసగా చేస్తూ వస్తే.. మీకు తెలియకుండానే ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. అలాగే ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. అప్పులు తీరిపోతాయి. 
 
ఇంకా ఇంటికి ఆగ్నేయ దిశలో ఒక గాజు పాత్రలో లేదా మట్టి పాత్రలో నీరును వుంచి అందులో కొత్తిమీర ఆకులను వేయాలి. ఈ నీటిని రోజూ మారుస్తూ.. వుండాలి. కొత్తిమీరను కూడా మార్చాలి. 
 
అలాగే ఓ పాత్రలో బియ్యం తీసుకుని.. తొలుత కుటుంబ యజమాని చేతి నుంచి రెండు నాణేలను ఆ బియ్యంలో వుంచమనాలి. తర్వాత ఆ కుటుంబంలోని వారంతా తలా ఒక్కో నాణేన్ని అందులో వుంచి పూజ గదిలో వుంచి పూజించాలి. ఇలా చేస్తే ధనార్జన పెరుగుతుంది. ఆహారానికి ఎలాంటి లోటు వుండదు. ఆరు మాసాలకు ఒకసారి ఈ బియ్యాన్ని మారుస్తూ వుండాలి. ఈ బియ్యాన్ని పక్షులకు ఆహారంగా వుంచేసి నాణేలను బీరువాలో భద్రపరుచుకోవాలి. 
 
ఇంటికి వెనుకల వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి. ధనాదాయం పెరుగుతుంది. ఇంట్లోని ఆగ్నేయంలో రెండు మొక్కజొన్న కందులను వేలాడదీయాలి. ఆరునెలలకు ఒకసారి వీటిని మార్చేసి.. ఆ మొక్కజొన్న గింజలను పక్షులను ఇవ్వడం చేయడం ద్వారా ఆ ఇంట సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. 
 
వీటితో పాటు మంగళవారం, శుక్రవారం పూట ఇంటిని శుభ్రం చేసుకుని మహాలక్ష్మీదేవిని, అమ్మవారిని పూజించడం ద్వారా సకల శుభాలతో పాటు.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

భర్త చిత్రహింసలు భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు... ఎక్కడ?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

22-11-2025 శనివారం ఫలితాలు - మీపై శకునాల ప్రభావం అధికం...

21-11-2025 శుక్రవారం ఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

తర్వాతి కథనం
Show comments