Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ తృతీయ రోజున మంచి నీటిని దానం చేయాలట..

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (13:57 IST)
వైశాఖ శుద్ధతదియనాడు చేసే ఏవ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితం అక్షయవౌతుంది. అక్షయతృతీయ’ రోజున ఏది ఇంటికివచ్చినా అది అక్షయంగా పెరుగుతుందని చాలామంది విశ్వసిస్తుంటారు. వీలైనంతవరకూ దానధర్మాలు చేయాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. 
 
ముఖ్యంగా మంచి నీటిని దానం చేయాలని అంటున్నాయి. అలాగే శెనగలు, గోధుమలు వంటి ఆహార ధాన్యాలను దానంగా ఇవ్వాలని చెబుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన ఈ జన్మలోనే కాదు వచ్చేజన్మలోను మంచినీటికి ఆహారానికి ఎలాంటి కొరత ఉండదట. రానున్న జన్మలు ఎలాంటివైనా.. మంచినీటికోసం ఆహారం కోసం వెతుక్కోవలసిన అవసరం రాదని స్పష్టం చేస్తున్నాయి. 
 
అందువలన అక్షయ తృతీయ రోజున మంచి నీటిని ఆహార ధాన్యాలను దానం చేయటం మరిచిపోకూడదు. అక్షయ తృతీయ రోజున కందిపప్పు, బియ్యం వంటి ధాన్యాలు కొనడం మంచిదని పండితులు చెబుతున్నారు. బంగారం, వెండితో పాటు ఎరుపు రంగు చీర లేదాఎరుపు రంగు వస్తువులు, వృద్ధులకు, పేద రైతులకు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

Pahalgam: వెళ్ళు, మీ మోదీకి చెప్పు.. బాధితుడి భార్యతో ఉగ్రవాదులు

పహల్గామ్ దాడి.. విమానాశ్రయంలోనే ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్

పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఇతడేనా? ఫోటో రిలీజ్!? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

తర్వాతి కథనం
Show comments