Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్ కల్లోలం, పుచ్చకాయలను కొంటున్నారా?

కరోనా వైరస్ కల్లోలం, పుచ్చకాయలను కొంటున్నారా?
, బుధవారం, 8 ఏప్రియల్ 2020 (22:41 IST)
పుచ్చకాయలు వేసవి కాలం రాగానే దర్శనమిస్తాయి. వీటిని తింటూ హాయిగా దాహార్తిని తీర్చకుంటుంటాం. ఐతే కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో వీటిని కొనాలన్నా భయపడుతున్నారు. ఐతే పుచ్చకాయలను కొనుక్కుని వచ్చి వాటిని శుభ్రంగా ఉప్పు నీటితో కొద్ది సేపు కడిగి ఆ తర్వాత ఓ నాలుగైదు గంటల తర్వాత ముక్కలుగా కోసుకుని తినవచ్చు. ఐతే శుభ్రపరచడంలో ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకున్నప్పటికీ ఈ కాలంలో చాలా జాగ్రత్తగా వుండాలి మరి.
 
ఇకపోతే పుచ్చ ముక్కలను తిని గింజలను పడేస్తూ ఉంటాం. అయితే గింజలలో అనేక పోషక విలువలు ఉన్నాయి. పుచ్చకాయ గింజల్లో విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. పుచ్చగింజల్లో ఉన్న పోషక విలువలేమిటో చూద్దాం.
 
1. పుచ్చ గింజలలో ఉండే అమైనోఆసిడ్స్ రక్త నాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాక రోగనిరోధక శక్తిని పెంచటానికి కూడా దోహదం చేస్తుంది.
 
2. ఈ గింజలలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో క్యాలరీలను శక్తిగా మార్చటంలో సహాయపడుతుంది.
 
3. మోనోసాచ్యురేటెడ్, పాలీ అన్‌సాచ్యూరేటెడ్ ఫ్యాటీ ఆసిడ్లు సమృద్ధిగా ఉండుట వలన గుండె ఆరోగ్యం బాగుంటుంది. అలాగే శరీరంలో కొలస్ట్రాల్ నిల్వలు లేకుండా చేయటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
 
4. పుచ్చకాయలో ఉండే లైకోపిన్ అనే పదార్దము పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా వీటిల్లో ఉండే ప్రొటీన్, అమైనో ఆసిడ్లు శరీరంలో రక్తపోటును తగ్గించటంలో చాలా బాగా సహాయపడతాయి.
 
5. పుచ్చకాయ గింజల్లో ఎల్ సిట్రులిన్ సమృద్ధిగా ఉండుట వలన కండరాలు బలంగా ఉండేందుకు మరియు కండరాల కణజాలాన్ని రిపేర్ చేయటానికి బాగా సహాయపడుతుంది.
 
6. ఈ గింజల్లో ఉండే ఫోలేట్ లేదా ఫోలిక్ ఆసిడ్ మెదడు పనితీరులో సహాయపడటమే కాకుండా ఫ్రీ రాడికల్స్ బారి నుండి మెదడును రక్షిస్తుంది.
 
7. పుచ్చగింజల్ని నీటిలో వేసి మరిగించి టీ లా తాగడం వలన కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంపొందించడానికి కండరాల కదలికల క్రమబద్దీకరణలో పుచ్చగింజలు తోడ్పడుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్‌డౌన్ సమయంలో నాట్స్ దాతృత్వం, అనాథాశ్రమానికి నిత్యావసరాలు పంపిణీ