బాబు హయాంలో జరిగివుంటే ధర్మాడి సత్యం ఎవరో తెలిసేది కాదు : విజయసాయిరెడ్డి

Webdunia
ఆదివారం, 27 అక్టోబరు 2019 (17:47 IST)
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బోటు ప్రమాదం జరిగివుండివుంటే కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం గురించి ఈ దేశానికి తెలిసివుండేది కాదని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. 
 
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గత నెలలో వశిష్ట పర్యాటకుల బోటు గోదవరి నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 35 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. ఈ బోటును 38 రోజుల తర్వాత విజయవంతంగా వెలికితీశారు. 
 
అయితే, దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. గోదావరి నది నుంచి బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం నైపుణ్యానికి, ఆయన శ్రమకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని ట్వీట్ చేశారు.
 
అయితే, ఇదే ప్రమాదం చంద్రబాబు హయాంలో జరిగి ఉంటే ధర్మాడి సత్యానికి పేరొచ్చేది కాదన్నారు. చంద్రబాబే బోటును వెలికితీసినట్టు ప్రచారం జరిగేదని, ధర్మాడి సత్యం పేరు ఎవరికీ తెలిసేది కాదన్నారు. చంద్రబాబే దగ్గరుండి డైవర్లకు మార్గదర్శనం చేసి గొలుసులు వేసి పడవను బయటికి లాగాడని కులమీడియా బాకాలు ఊదేదని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

Aari: అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు : డైరెక్టర్ జయశంకర్

మటన్ సూప్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా: డైరెక్టర్ వశిష్ట

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

Karti: హీరో కార్తి, స్టూడియో గ్రీన్ కాంబో క్రేజీ మూవీ వా వాతియార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments