Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించడం మానేశాడనీ చావబాదిన స్నేహితులు

Webdunia
బుధవారం, 8 మే 2019 (15:53 IST)
సాధారణంగా ఒకసారి మద్యానికి బానిసలైన తర్వాత తిరిగి దాన్ని వదిలిపెట్టడం అసాధ్యం. ఒకవేళ మధ్యలో మానేసినా తిరిగి దాని జోలికిపోకుండా ఉండలేరు. ఇలా మద్యానినికి బానిసలైన అనేక మంది తన జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు. అనేక కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి.
 
ఈ క్రమంలో ఓ వ్యక్తి మద్యం సేవించడం పూర్తిగా మానేశాడు. దీన్ని అతని స్నేహితులు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా పెళ్లి అయ్యాక గత కొన్ని నెలలుగా అతను మిత్రులతో కలిసి మందు కొట్టడం లేదు. దాంతో అతనిపై పగ పెంచుకొని ఇంటికి వచ్చి మరీ చావబాదారు. ఈ దారుణ సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో చోటుచేసుకుంది. 
 
వివాహం అయ్యాక తమ స్నేహితుడు మందు మానేసాడని, అతనిపై స్నేహితులు దాడి చేశారు. అడ్డు వచ్చిన అతని భార్య, ఇతర కుటుంబ సభ్యులను కూడా చావగొట్టారు. మిత్రులంతా కలిసి అమృత్‌పాల్‌‌‌ను అతని ఇంటిముందు చావబాదారు. అంతేకాకుండా అడ్డువచ్చిన భార్య, అతని కుటుంబ సభ్యులపై కూడా చేయిచేసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. అమృత్‌పాల్‌‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments