Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించడం మానేశాడనీ చావబాదిన స్నేహితులు

Webdunia
బుధవారం, 8 మే 2019 (15:53 IST)
సాధారణంగా ఒకసారి మద్యానికి బానిసలైన తర్వాత తిరిగి దాన్ని వదిలిపెట్టడం అసాధ్యం. ఒకవేళ మధ్యలో మానేసినా తిరిగి దాని జోలికిపోకుండా ఉండలేరు. ఇలా మద్యానినికి బానిసలైన అనేక మంది తన జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు. అనేక కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి.
 
ఈ క్రమంలో ఓ వ్యక్తి మద్యం సేవించడం పూర్తిగా మానేశాడు. దీన్ని అతని స్నేహితులు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా పెళ్లి అయ్యాక గత కొన్ని నెలలుగా అతను మిత్రులతో కలిసి మందు కొట్టడం లేదు. దాంతో అతనిపై పగ పెంచుకొని ఇంటికి వచ్చి మరీ చావబాదారు. ఈ దారుణ సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో చోటుచేసుకుంది. 
 
వివాహం అయ్యాక తమ స్నేహితుడు మందు మానేసాడని, అతనిపై స్నేహితులు దాడి చేశారు. అడ్డు వచ్చిన అతని భార్య, ఇతర కుటుంబ సభ్యులను కూడా చావగొట్టారు. మిత్రులంతా కలిసి అమృత్‌పాల్‌‌‌ను అతని ఇంటిముందు చావబాదారు. అంతేకాకుండా అడ్డువచ్చిన భార్య, అతని కుటుంబ సభ్యులపై కూడా చేయిచేసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. అమృత్‌పాల్‌‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments