Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒంటరిగా ఉన్న మహిళ... తలుపులు వేసి కోర్కె తీర్చమన్న యువకుడు

ఒంటరిగా ఉన్న మహిళ... తలుపులు వేసి కోర్కె తీర్చమన్న యువకుడు
, ఆదివారం, 5 మే 2019 (18:16 IST)
మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో లోపలికి వెళ్లి తలుపులు వేసి... తన కోర్కె తీర్చమని వేధించాడో యువకుడు. చివరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ యువకుడు జైలుపాలయ్యాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదారాబాద్ నగరంలోని నగరంలోని శ్రీకృష్ణనగర్‌లో ఓ ఇంట్లో దంపతులు ఆర్నెల్ల క్రితం అద్దెకు దిగారు. అయితే ఇంటి యజమాని కుమారుడు అహ్మద్, అద్దెకు దిగిన వివాహిత(21)పై కన్నేశాడు. గత నెల 29న ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లోపలకు వెళ్లి తలుపు వేశాడు. అనంతరం తన కోరికను తీర్చాలని కోరాడు. ఇందుకు సదరు బాధితురాలు తిరస్కరించగా, ఆమెతో అహ్మద్ అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
దీంతో బాధితురాలు ప్రతిఘటించింది. ఈ విషయం బయటకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించిన అహ్మద్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంటికి వచ్చిన భర్తకు జరిగిన ఘటనను బాధితురాలు వివరించింది. దీంతో వీరిద్దరూ కలిసి బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పరారీలో ఉన్న అహ్మద్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
తమ ఇంటిలో అద్దెకు దిగిన వివాహితపై ఇంటి యజమాని కుమారుడు కన్నేశాడు. ఎవ్వరూ లేని సమయంలో ఆమె దగ్గరకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆమె భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరుల పేర్లు చెప్పుకుని ఓట్లు దండుకునే వ్యక్తి మోడీ : ప్రియాంకా ఫైర్