Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందరూ అది పెట్టుకుని వెళ్ళమని చెబుతున్న రాశీఖన్నా

అందరూ అది పెట్టుకుని వెళ్ళమని చెబుతున్న రాశీఖన్నా
, శనివారం, 4 మే 2019 (17:06 IST)
వరుసగా విజయవంతమైన సినిమాలు చేసిన రాశీఖన్నా ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. చాలారోజుల పాటు ఖాళీగానే ఉన్నారు. అవకాశాలు రాకపోయినా ఏ డైరెక్టర్ దగ్గరకు వెళ్ళలేదు రాశీ ఖన్నా. అయితే ఈమధ్య షాపింగ్‌లకు ఫ్రెండ్స్‌‍తో ఎక్కువగా తిరుగుతూ కనిపిస్తున్నారు. తన సొంత కారును తోలుకుంటూ వెళుతున్నారు. 
 
అయితే తాను తిరిగే ప్రాంతంలో ఎవరైనా హెల్మెట్ ధరించకుండా ఉంటే మాత్రం కారు ఆపి మారి క్లాస్ పెరుకుతోందట రాశీ ఖన్నా. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే హెల్మెట్ పెట్టుకుంటే మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు. అది ముందు గుర్తు పెట్టుకోవాలి అంటూ హెల్మెట్ పెట్టుకోనివారికంతా దారిలో చెబుతూ వెళుతోందట. అయితే రాశీఖన్నా చెబుతున్న మాటలను పాజిటివ్‌గా తీసుకుంటే మరికొంతమంది మాత్రం నీకెందుకమ్మా నీ పని నువ్వు చూసుకో అంటూ చెబుతున్నారట. 
 
రాశీఖన్నాతో పాటు కారులో వెళ్ళే స్నేహితులు కూడా నీకెందుకు ఇవన్నీ... వెళదాం పదా అని చెబుతున్నారట. అయితే రాశీ ఖన్నా మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట. నా తండ్రి నాకు చెప్పారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని. అందుకే నేను ట్రాఫిక్స్ రూల్స్‌ను వాహనదారులకు చెబుతాను.. చెబుతూనే ఉంటానంటోందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంకటేష్ - వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పి అల్లాద్దీన్ ట్రైలర్‌ను రిలీజ్