Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో మరో రవళి.. ప్రేమించలేదని పెట్రోల్ పోసి నిప్పంటించారు..

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (11:25 IST)
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రేమించలేదన్న అక్కసుతో ఓ యువతిపై ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే కేరళలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ప్రేమించమని, పెళ్లి చేసుకోమని వేధిస్తూ వెంటబడుతున్న ఒక యువకుడు చివరికి ఆ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పటించాడు.  ప్రస్తుతం 80 శాతం గాయాలతో బాధితురాలు ఆసుప్రతిలో మృత్యువుతో పోరాటాడుతోంది. కేరళలోని పాతానంతిట్టలో ఈ ఘటన జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళలోని కుంబానాడ్ ప్రాంతానికి చెందిన అజిన్ రేజి మ్యాథ్యూ (20) అనే యువకుడు టాటా మెడికల్ సైన్సెస్‌లో విద్యాభ్యాసం చేస్తున్న కవిత విజయ్‌కుమార్ (18) అనే విద్యార్థిని ప్రేమించసాగాడు. కానీ, ఆ విద్యార్థిని మాత్రం మ్యాథ్యూను దూరంగా ఉంచసాగింది. దీంతో ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామంటూ కవితను వేధించసాగాడు. పలు విధాలుగా బెదిరించాడు. అయినా నిరాకరించింది. 
 
దీంతో ఆగ్రహించిన మ్యాథ్యూ రెండు బాటిళ్లలో పెట్రోల్ నింపుకుని కవితతో గొడవకు దిగాడు. చివరకు పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు సంఘటనా స్థలం నుంచి పారిపోతున్న నిందితుడిని పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments