Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెక్కింపు పూర్తికాకుండానే ఓటమిని అంగీకరించిన యశ్వంత్ సిన్హా

Webdunia
గురువారం, 21 జులై 2022 (21:53 IST)
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం సాధించారు. ఈ నెల 18వ తేదీన జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల నుంచి చేపట్టారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది ఫలితాలను ప్రకటించారు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఈ ఓట్ల లెక్కింపు పూర్తికాకుండానే ఆమె సమీప ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన ఓటమిని అంగీకరించారు. 
 
గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అధికార పక్షానికి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉందని తెలిసి కూడా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన యశ్వంత్ సిన్హా ఓటు హక్కు కలిగిన ప్రజా ప్రతినిధులు ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే. 
 
తాజా ఎన్నికల్లో ఓటమిని ఖరారు కాగానే విజేత ద్రౌపది ముర్ముకు ఆయన అభినందలు తెలిపారు. భారత రాష్ట్రపతిగా విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షిపాతంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ ఆయన ముర్ముకు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments