Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రశాంతంగా సాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు

president bhavan
, గురువారం, 21 జులై 2022 (11:41 IST)
భారతదేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమై ప్రశాంతంగా సాగుతోంది. పార్లమెంట్ భవనంలో సాగుతున్న ఈ ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత విజేతను ప్రకటిస్తారు. 
 
ఈ ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత ఎంపీల ఓట్లను లెక్కించి, ఆ తర్వాత ఆల్ఫాబెట్ ఆర్డరులో రాష్ట్రాల వారీగా ఓట్ల లెక్కింపు చేపడుతారు. మొత్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. అంటే సాయంత్రం 4 గంటల సమయంలో తుది ఫలితం వెల్లడించే అవకాశం ఉంది. 
 
ఈ నెల 18వ తేదీన జరిగిన ఈ ఎన్నికల పోలింగ్‌లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాలు పోటీపడుతున్నారు. వీరిలో ద్రౌపది ముర్ముకే అధిక విజయావకాశాలు ఉన్నాయి. కాగా, ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24వ తేదీతో ముగుస్తుంది. 25వ తేదీన కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు