ప్రమాదాలకు ప్రయత్నించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు : రైల్వే మంత్రి వైష్ణవ్

ఠాగూర్
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (09:43 IST)
కుట్రపూరితంగా ప్రమాదాలకు ప్రయత్నించే వారిని ఉపేక్షించేది లేదని కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్ హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రైలు పట్టాలపై కుట్రపూరితంగా ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుపరాడ్లు, సిమెంట్ ఇటుకలు పెట్టి రైలుకు ప్రమాదం తలపెట్టే ఘటనల వల్ల రైల్వే శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా రాష్ట్రాల యంత్రాంగాలు, పోలీసులతో చర్చలు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఉద్దేశ్యపూర్వకంగా రైలు ప్రమాదాలకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, డీజీపీలు, హోంశాఖ కార్యదర్శులతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ కూడా ఇందులో భాగస్వామ్యమై ఉంటుందన్నారు. ప్రమాదాలకు యత్నించే వారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి ఘటనల పట్లే రైల్వేశాఖశ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు రైల్వే జోన్ల అధికారులతో కలిసి పని చేస్తారని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments